Homeజాతీయ వార్తలుPakistan Army : కుక్క తోక మాదిరి పాకిస్తాన్ బుద్ధి.. తగిన శాస్తి చేసిన భారత్.....

Pakistan Army : కుక్క తోక మాదిరి పాకిస్తాన్ బుద్ధి.. తగిన శాస్తి చేసిన భారత్.. ఇంతకూ ఏమైందంటే ?

Pakistan Army : జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) వద్ద పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం సాయంత్రం, పాకిస్తాన్ సైన్యం అనేక రౌండ్లలో కాల్పులు జరిపింది. ఈ కాల్పుల తర్వాత భారత సైన్యం తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంది. దీంతో పాకిస్తాన్(Pakistan) వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. పాకిస్తాన్ సైన్యం ప్రతిరోజూ ఇలాంటి దుర్మార్గపు చర్యలను కొనసాగిస్తూ, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఈ కాల్పుల నేపథ్యంలో భారత సైన్యం(indian army) తన నిఘా వ్యవస్థను మరింత కఠినతరం చేసింది. అలాగే, పాకిస్తాన్ చేయబోయే ఏదైనా చర్యలకు తగిన సమాధానం ఇవ్వడానికి భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేసింది.

ఉగ్రవాద దాడి సైనికుడికి గాయాలు
పూంచ్ సెక్టార్‌లోని ఎల్‌ఓసి వద్ద ఉగ్రవాదులు ముళ్ల తీగల కంచె దగ్గర ఐఈడీ (ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్)ను అమర్చారు. దీనిపై బాంబు పేలుడుతో ఒక భారత సైనికుడు గాయపడ్డాడు. ఈ దాడి పాక్ సైన్యానికి ప్రతీకారంగా భారత సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్ సైన్యానికి కూడా ప్రాణనష్టం సంభవించింది.

జమ్మూ ప్రాంతాన్ని లక్ష్యంగా ఉగ్రవాద సంస్థలు
గత వారం రోజులుగా పాకిస్తాన్ వైపు నుంచి మరో బోలెడన్ని కాల్పులు, దాడులు చోటుచేసుకున్నాయి. 8 ఫిబ్రవరి 2025న రాజౌరి జిల్లాలో ఎల్‌ఓసి వద్ద గస్తీ తిరుగుతున్న భారత సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. అలాగే, రాజౌరిలోని నౌషెరా సెక్టార్‌లో స్నిపర్ బుల్లెట్‌తో ఒక భారత సైనికుడు గాయపడ్డాడు. ఈ దాడులతో పాటు, జమ్మూలోని అఖ్నూర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఐఈడీ పేలుడు జరిపారు. దీంట్లో ఒక కెప్టెన్ సహా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరొక సైనికుడు గాయపడ్డాడు.

జమ్మూ ప్రాంతంలో రెచ్చగొట్టే యత్నాలు
కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థలు వారి పాడుచేసిన ప్లాన్ తర్వాత, జమ్మూ ప్రాంతాన్ని భయాందోళనలకు గురి చేయడానికి నిరంతరం కుట్రలు పన్నుతున్నాయి. తాజా వార్తల ప్రకారం.. ఈ నెలలో జమ్మూ ప్రాంతంలోని రాజౌరి జిల్లాలోని కేరి సెక్టార్‌లోని ఎల్‌ఓసి సమీపంలో ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నించారు. అయితే, భారత సైన్యం అప్రమత్తంగా ఉండి చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేసింది. భారత సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రతి దాడి, ఉగ్రవాద చర్యలకు తగిన సమాధానాలు ఇస్తూ, సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version