Homeజాతీయ వార్తలుPakistan Drone Drug Smuggling India Border BSF Operation: పాకిస్తాన్‌ మరో దుస్సాహసం.. సీఐడీ,...

Pakistan Drone Drug Smuggling India Border BSF Operation: పాకిస్తాన్‌ మరో దుస్సాహసం.. సీఐడీ, బీఎస్‌ఎఫ్‌ ఆపరేషన్‌ సక్సెస్‌!

Pakistan Drone Drug Smuggling India Border BSF Operation: భారత్‌ను దెబ్బతీసేందుకు మన దాయాది దేశం అనేకవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు ఉగ్రవాదులను పంపుతోంది. దేశంలోని ఏజెంట్ల సహాయంతో దేశంలో పేలుళ్లు, అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా హెరాయిన్‌ సరఫరా చేస్తోంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ సరిహద్దులో పాకిస్తాన్‌ నుంచి డ్రోన్‌ ద్వారా వచ్చిన 12 కిలోల హెరాయిన్‌ను సీఐడీ, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) సంయుక్త ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నాయి. ఈ డ్రగ్స్‌ మార్కెట్‌ విలువ రూ.60 కోట్లు. వాటిని తరలించేందుకు వచ్చిన నలుగురు స్మగ్లర్లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌ ద్వారా పాకిస్తాన్‌ ఆధారిత అంతర్జాతీయ డ్రగ్‌ సిండికేట్‌ ప్లాన్‌ బయటపడింది.

కొత్త స్మగ్లింగ్‌ వ్యూహం..
పాకిస్తాన్‌ నుంచి డ్రగ్స్‌ సరఫరాకు డ్రోన్లను వాడటం ఇది కొత్తేమీ కాదు, కానీ 12 కిలోల భారీ మొత్తం ఒకేసారి రవాణా చేయడం ఆందోళన కలిగిస్తోంది. పాక్‌ సరిహద్దు నుంచి 5–10 కి.మీ. లోపలికి డ్రోన్లు ఎగురుతున్నాయి. రాత్రిపూట, మంచు కమ్ముకున్న సమయాల్లో గుర్తించడం కష్టం. ఈ డ్రోన్లు చైనా తయారు చేసినవి. 50 కి.మీ. పరిధి కలిగినవి. ఒక్కో డ్రోన్‌లో 2–3 కిలోల హెరాయిన్‌ మోసుకెళ్లగలవు. పాక్‌ లాహోర్‌/సియాల్‌కోట్‌ నుంచి డ్రోన్‌ ఎగురుతుంది. భారత్‌ సరిహద్దులోని ఖాళీ ప్రాంతాల్లో (పొలాలు, ఇసుక దిబ్బలు) డ్రాప్‌ చేస్తుంది. వాటిని స్థానిక స్మగ్లర్లు తీసుకెళ్లి, పంజాబ్, హర్యాణా, ఢిల్లీకి తరలిస్తారు.

అంతర్జాతీయ డ్రగ్‌ సిండికేట్‌..
పోలీసుల విచారణలో బయటపడిన విషయాల ప్రకారం, ఇది కేవలం స్థానిక ముఠా కాదు.. పాకిస్తాన్‌ ఇంటర్‌–సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) మద్దతుతో నడిచే అంతర్జాతీయ సిండికేట్‌. డ్రగ్స్‌ వ్యాపారం ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తాయి. భారత్‌ యువతను డ్రగ్స్‌ బానిసలుగా మార్చి, అంతర్గత అస్థిరత సృష్టించడం. పంజాబ్‌లో ఇప్పటికే గంజాయి, హెరాయిన్‌ సేవనం పెరిగింది. 2025లో పంజాబ్‌ పోలీసులు 2 టన్నుల డ్రగ్స్‌ పట్టుకున్నారు. ఇందులో 60 శాతం పాక్‌ నుంచి వచ్చినవే.

డ్రోన్లపై బీఎస్‌ఎఫ్‌ దృష్టి..
డ్రోన్లను అడ్డుకోవడానికి బీఎస్‌ఎఫ్‌ కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టింది. ఆంటీ–డ్రోన్‌ గన్స్‌తో డ్రోన్‌ సిగ్నల్స్‌ను జామ్‌ చేసి, కిందకు దింపే పరికరాలు ఉపయోగిస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రత ఆధారంగా గుర్తింపునకు థర్మల్‌ కెమెరాలు ఉపయోగిస్తోంది. పది కిలోమీటర్ల పరిధిలో గుర్తించేలా డ్రోన్‌ డిటెక్షన్‌ రడార్లు వినియోగిస్తోంది. సరిహద్దు వెంబడి 2,400 కి.మీ. మేర లేజర్‌ ఫెన్సింగ్, సెన్సార్లు ఏర్పాటు చేసింది. 2025–26లో ఇప్పటి వరకు 45 డ్రోన్లను కూల్చివేశారు, 150 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సరిహద్దు భద్రతను మరింత కఠినతరం చేయాలని ఆదేశించింది. పాకిస్తాన్‌ డ్రోన్లను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్, అమెరికా సాంకేతికతలను సమీకరిస్తున్నారు. పాకిస్తాన్‌ డ్రగ్స్‌ ద్వారా యుద్ధం చేస్తే, భారత్‌ సాంకేతికత, చాకచక్యంతో తిరుగులేని సమాధానం ఇవ్వాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version