Pahalgam Attack: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 27 మంది, అందులో 26 మంది భారతీయులు, ఒక నేపాల్ జాతీయుడు మరణించారు. ఈ దాడిని సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ భారత్ గట్టి వైఖరి అవలంబించింది. ఈ దాడి ప్రాంతంలో ఇటీవలి ఎన్నికల విజయం, ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడానికి జరిగిన కుట్రగా భావించిన భారత్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
Also Read: ఇప్పుడే కాదు…25 ఏళ్ల క్రితం జమ్ము కాశ్మీర్ లో ఏం జరిగిందంటే?
సహల్గామ్ దాడి తర్వాత భారత్ అప్రమత్తమైంది. మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తాజా దాడి వెనుక ఉన్నట్లు అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నివాసంలో జరిగిన కేబినెట్ రక్షణ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కమిటీ నిర్ణయాలను కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఐదు కీలక నిర్ణయాలు పాకిస్థాన్ ప్రభావాన్ని అరికట్టడం, ఉగ్రవాదానికి మద్దతిచ్చినందుకు శిక్షించడం లక్ష్యంగా చేపట్టబడ్డాయి. ఈ చర్యలు భారత్ యొక్క ఉగ్రవాదంపై రాజీలేని వైఖరిని ప్రతిబింబిస్తాయి.
సింధూ నదీ జలాల ఒప్పందం (1960) రద్దు
భారత్, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య నదీ జలాల పంపిణీని నియంత్రించింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ వ్యవసాయం, ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు మూసివేత
వాణిజ్యం, ప్రయాణాల కోసం కీలకమైన అటారీ సరిహద్దు చెక్పోస్టును తక్షణం మూసివేశారు. సరైన ధ్రువపత్రాలతో భారత్లో ఉన్న పాకిస్థాన్ పౌరులు మే 1, 2025లోపు తిరిగి వెళ్లాలని ఆదేశించారు.
సార్క్ వీసా మినహాయింపు పథకంపై నిషేధం
సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థాన్ పౌరులకు భారత్లోకి ప్రవేశం నిషేధించబడింది. ఈ పథకం కింద జారీ చేసిన అన్ని వీసాలు రద్దు చేయబడ్డాయి. ఈ వీసాల కింద భారత్లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో స్వదేశానికి వెళ్లాలని ఆదేశించారు.
సైనిక సలహాదారుల బహిష్కరణ
ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశించారు. అదే సమయంలో, ఇస్లామాబాద్లోని భారత త్రివిధ దళాల సలహాదారులను భారత్ ఉపసంహరించుకోనుంది.
దౌత్య సిబ్బంది తగ్గింపు
రెండు దేశాల దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మే 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.
స్థిరత్వానికి గండి
ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో జరిగిన ఈ ఉగ్రదాడి, జమ్మూకశ్మీర్లో ఇటీవలి ఎన్నికల విజయం, ఆర్థికాభివద్ధిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంగా భారత్ భావిస్తోంది. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ జాతీయుడు మరణించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ దాడిని ఖండిస్తూ, పాకిస్థాన్ ఈ ప్రాంతంలో అస్థిరతను సష్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
ఇటీవల తహవ్వుర్ రాణాను భారత్కు రప్పించిన విషయాన్ని మిస్రీ ఈ సందర్భంగా గుర్తు చేశారు, ఇది ఉగ్రవాదులపై భారత్ యొక్క నిరంతర పోరాటానికి నిదర్శనమని పేర్కొన్నారు.
భారత్ విస్తృత వ్యూహం
దౌత్య చర్యలతోపాటు, భారత్ ఈ దాడికి బహుముఖంగా స్పందిస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో భద్రత, దౌత్య వ్యూహాలపై ఏకాభిప్రాయం కుదిర్చేందుకు చర్చలు జరగనున్నాయి. అదనంగా, సరిహద్దు రేఖ (LOC) వెంబడి నిఘాను పెంచడం, అంతర్జాతీయ భాగస్వాములతో ఇంటెలిజెన్స్ సమాచార పంపిణీని మెరుగుపరచడం వంటి ఉగ్రవాద నిరోధక చర్యలను బలోపేతం చేయాలని CCS నిర్ణయించింది.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడి: కాశ్మీర్ను వీడుతున్న పర్యాటకులు