Ntr Trust Gest 2023 కు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఏడాది డిసెంబరు 4న పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి తెలిపారు. ఈ సదవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలందరూ వినియోగించుకోవాలని.. ఆసక్తి ఉన్నవారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. www.ntrtrust.orgలో 11.11.2022 నుంచి 30.11.2022 వరకు నమోదు చేసుకొనవచ్చు. గత ఎనిమిదేళ్లగా ఎన్టీఆర్ విద్యాసంస్థలు ప్రతిష్టాత్మకంగా జీఈఎస్టీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా.
పదో తరగతి విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ శుభవార్త చెప్పింది. ప్రతిభావంతులైన విద్యార్థినులకు స్కాలర్షిప్ అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి తెలిపారు. Girls Education Scholarship Test (GEST-2023) నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత ఎనిమిదేళ్లగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీఈఎస్టీ-2023 ని ఈ ఏడాది డిసెంబరు 4న పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలియచేశారు.
ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకారవేతనం అందజేయబడుతుంది అన్నారు. ఈ క్రమంలో మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5 వేలు.. తర్వాత 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే వరకు ఇస్తామన్నారు.
ఈ సదవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు వెబ్ సైట్-www.ntrtrust.orgలో 11.11.2022 నుంచి 30.11.2022 వరకు నమోదు చేసుకొనవచ్చున్నారు. ఇతర వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
మొబైల్ నెంబర్: 7660002627/7660002628.