ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు.. పొలిటికల్‌ ఎంట్రీపై తారక్‌

అభిమానుల రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని నందమూరి తారక రామారావు అన్నారు. వెండితెర వేదికగా అభిమానుల్ని అలరించిన ఆయన కొన్నేళ్ల విరామం తర్వాత మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారంకానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌ ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఆ సందర్భంగా తారక్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Also Read: అమ్మాయిని అది అడిగిన హైప‌ర్ […]

Written By: Srinivas, Updated On : March 13, 2021 2:46 pm
Follow us on


అభిమానుల రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని నందమూరి తారక రామారావు అన్నారు. వెండితెర వేదికగా అభిమానుల్ని అలరించిన ఆయన కొన్నేళ్ల విరామం తర్వాత మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారంకానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌ ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఆ సందర్భంగా తారక్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Also Read: అమ్మాయిని అది అడిగిన హైప‌ర్ ఆదీ.. ఇంత దారుణ‌మా? అని అంద‌రూ షాక్!

‘ఈ ప్రోగ్రాం చేసేందుకు ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. వివిధ జీవన స్థితిగతుల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడమే దీని లక్ష్యం. గతంలో చిరంజీవి, నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఓ బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేశారు. కాబట్టి నాకు ఇది ఓ ఛాలెంజ్‌. నా వంతు మార్క్‌ క్రియేట్‌ చేయడానికి కృషి చేస్తా. మొదటి నుంచి సోషల్‌ మీడియాలో నేను అంత యాక్టివ్‌గా ఉండేవాడిని కాదు. ఫ్యాన్స్ నా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం అనుకుంటున్నారు? అనే విషయాన్ని ప్రతిసారీ నా టీమ్‌ నాకు సమాచారాన్ని ఇస్తుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంతలా డిమాండ్‌ చేసింది. అందుకే మూడేళ్ల నుంచి కనిపించడం లేదు. అలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్విస్తున్నా. మన హీరోలకు దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చే చిత్రమది. అలాగే, నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఖాళీ సమయాన్ని వాళ్లతో సరదాగా గడుపుతున్నాను. అంతకు మించి నేను ఏం కోరుకుంటాను’ అని చెప్పుకొచ్చారు.

అలాగే.. రాజకీయ రంగ ప్రవేశంపై స్పందిస్తూ.. ‘‘ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు’’ తర్వాత తీరిగ్గా ఓరోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందాం. జూనియర్‌ ఎన్టీఆర్‌, తారక్‌, రామారావు ఇలా ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతా. ఇలాగే పిలవండి అని నేను ఎప్పుడూ పట్టుబట్టి అడగలేదు’ అని చెప్పారు.

Also Read: ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’పై ప‌వ‌న్ కొడుకు స్పంద‌న‌.. ద‌ర్శ‌కుడు క్రిష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అకీరా!

‘నేను అభిమానులకు చేసిన దానికంటే అభిమానులు నాకు చేసింది చాలా ఎక్కువ. మీరు ఇలా చేస్తే బాగుంటుందని నేను ఏరోజూ వాళ్లతో చెప్పలేదు. వాళ్లే అనుకుని ఎన్నో మహోన్నతమైన సేవా కార్యక్రమాలు చేశారు. చేస్తున్నారు. ఏ హీరో అభిమాని అనేది ముఖ్యం కాదు.. మనుషులుగా సేవా చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అభిమానుల రుణం నేను ఏ రోజుకీ తీర్చుకోలేను. రుణం తీరని బంధం అది. అభిమానులు కాలర్‌ ఎగరేసుకుని తిరిగే స్థాయిలో నేను తప్పకుండా పనిచేస్తా. మీ నమ్మకాన్ని ఒమ్ముచేయను. షో ఫార్మాట్‌ ఏం మారలేదు. ఈ షో నుంచి డబ్బులు ఎంత తీసుకువెళ్లామన్నది ముఖ్యం కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్లు తప్పకుండా ఆత్మవిశ్వాసంతో వెళ్లేలా చేయడమే నా బాధ్యత’ అని వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్