
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. సుశాంత్ హత్యకు గురయ్యాడని చాలా మంది సెలెబ్రెటీలు ఆరోపించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యంస్వామి అయితే హత్యనే అని ప్రధాని మోడీకి లేఖ రాశారు.సీబీఐ విచారణకు ఆదేశించారు.
తాజాగా పలు కోణాల్లో విచారణ జరిపిన సీబీఐ సుశాంత్ కేసులో హత్యకు గురయ్యారనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏ విధమైన సాక్ష్యాధారాలు లభించలేదని.. ఇంకా దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.
ఇక ఆయనను ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నామని సీబీఐ తెలిపింది. రియా చక్రవర్తితోపాటు పలువురు అనుమానితులను విచారించామని.. ఫోరెన్సిక్ రిపోర్టులు, అనుమానితుల వాంగ్మూలాలు.. క్రైమ్ రీకన్ స్ట్రక్షన్ చేశామని.. ఇది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ తెలిపింది.
అయితే దర్యాప్తు ఆపబోమని.. హత్య కోణంలోనే విచారణ జరుపుతున్నామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.