Homeజాతీయ వార్తలుNitin Gadkari: చావడానికి ముందు హమాస్ చీఫ్ కలిశాడు.. బాంబు పేల్చిన గడ్కరీ

Nitin Gadkari: చావడానికి ముందు హమాస్ చీఫ్ కలిశాడు.. బాంబు పేల్చిన గడ్కరీ

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.. తరచూ సంచలన వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవలే టోల్‌గేట్స్‌ విషయంలో 2026 నుంచి కొత్త విధానం అందుబాటులోకి రాబోతోందని వెల్లడించారు. తాజాగా హమాస్‌ చీఫ్‌కు సంబంధించి బాంబు పేల్చారు. ఏడాదిన్నర క్రితం తాను హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియాను కలిశానని ప్రకటించారు. హనియా హత్యకు కొన్ని గంటల ముందే ఇద్దరం భేటీ అయినట్లు వెల్లడించాడు. ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణస్వీకారానికి భారత ప్రతినిధిగా వెళ్లానని, ప్రధాని మోదీ సూచనల మేరకు 2024లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు దేశాల నాయకులతో అనధికారిక చర్చలు జరిగాయి. ఈ సమావేశాల్లో హమాస్‌ నాయకుడు ఇస్మాయిల్‌ హనియా కూడా పాల్గొన్నట్లు వెల్లడించారు. ప్రమాణస్వీకారం తర్వాత అధ్యక్షుడు, చీఫ్‌ జస్టిస్‌తో కలిసి హనియాను చూశారని తెలిపారు.

హత్య సమయంలో ఆశ్చర్యకర హెచ్చరిక
ప్రమాణ కార్యక్రమం ముగిసిన తర్వాత గడ్కరీ ఓహోటల్‌లో విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇరాన్‌ రాయబారి త్వరగా వెళ్లాలని సూచించారు. హమాస్‌ చీఫ్‌ హత్యకు గురయ్యారని తెలిపినప్పుడు ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. ఈ సంఘటన కొన్ని గంటల ముందే జరిగిన కలయికను గుర్తుచేస్తూ, ప్రపంచ రాజకీయాల్లో భారత్‌ పాత్రను ప్రస్తావించారు.

ఇజ్రాయెల్‌ దాడి వెనుక నేపథ్యం
2024 జూలై 31న టెహ్రాన్‌లోని గెస్ట్‌ హౌస్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో హనియా, ఆయన రక్షణాధికారి మరణించారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ సంఘర్షణ సమయంలో ఈ ఘటన జరగడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్‌ భూభాగంలో జరిగిన ఈ ఆపరేషన్‌ అంతర్జాతీయ చట్టాలను సవాలు చేసినట్టు విమర్శలు వచ్చాయి. అయితే గడ్కరీ అనుభవం భారత్‌ మధ్యప్రాంతీయ దేశాల మధ్య సమతుల్య సంబంధాలను సూచిస్తుంది. ఇరాన్‌తో దౌత్య సంబంధాలు, ఇజ్రాయెల్‌తో రక్షణ సహకారం ఉన్న భారత్‌కు ఇలాంటి సందర్భాల్లో కీలక పాత్ర ఇది. ఈ ఘటన ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలను పెంచినప్పటికీ, భారత్‌ శాంతి చర్చలకు మద్దతు ఇచ్చే స్థానంలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ హత్య హమాస్‌–ఇజ్రాయెల్‌ ఘర్షణకు కొత్త దశను తీసుకొచ్చింది. ఇరాన్‌ ప్రతీకార చర్యలు, ప్రాంతీయ మిత్రదేశాల స్పందనలు భవిష్యత్‌ ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. గడ్కరీ వెల్లడి దౌత్య వ్యూహాల గురించి కొత్త చర్చలకు దారితీసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version