Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఢిల్లీ...

Nara Lokesh: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఐడీ

Nara Lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వ్యవహారంలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు ఒక రకంగా హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం డిస్పోస్ చేసింది. అంతేకాదు ఈ కేసులో లోకేష్ కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సిఐడిని కోర్టు ఆదేశించింది. మరోవైపు విచారణకు సహకరించాలని నారా లోకేష్ కు కోర్టు తేల్చి చెప్పింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలు అలముకున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు కావడం, బెయిల్ కోసం వారు దాఖలు చేస్తున్న పిటిషన్లు ఫలితం ఇవ్వకపోవడంతో టీడీపీలో నైరాశ్యం అలముకుంది. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పేరు ప్రస్తావనకు రావడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14 గా నారా లోకేష్ పేరు చేరుస్తూ ఈమధ్యే విజయవాడ కోర్టులో ఏపీ సిఐడి మెమో దాఖలు చేసింది. ఈ క్రమంలో తనను అరెస్టు చేయకుండా నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం లోకేష్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. లోకేష్ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఏపీ సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలను వినిపించారు.. ఈక్రమంలోనే లోకేష్ ను 41_ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. “మేము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని లోకేష్ ను ఆదేశించండి” అంటూ శ్రీరామ్ చేసిన అభ్యర్థనను ఏపీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.. 41_ఏ కింద నోటీసులు విచారించుకోవాలని సూచించింది. ఆదేశాలు అనుసరించి నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు. లోకేష్ ను కలిసి నోటీసులు అందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, సీ ఆర్ పీ సీ_41 ఏ (ఏడు సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్లు) సంబంధించిన నిబంధనలను పాటిస్తామని ప్రభుత్వం తరపున లాయర్ చెప్పారు. ఒకవేళ లోకేష్ విచారణ సహకరించకపోతే అరెస్ట్ కనుక చేయాల్సి వస్తే, కోర్టు అనుమతితోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన వివరించారు. ఈ కారణంగానే లోకేష్ కు 41_ఏ నోటీసు ఇస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. కాగా, లోకేష్ ముందస్తు బెయిల్ కు పిటిషన్ వేశారు కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సెక్షన్ల కింద నమోదు చేసి ఉంటారని, ఇప్పుడు అవి పక్కన పెట్టి ఉంటారని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి ఇంకా నిర్ధారణ కాలేదని, వివరాలు తెలియాల్సి ఉందని అంటున్నారు. అయితే తాజా ఎఫ్ ఐ ఆర్ లో అధికారులు ఏమేమీ పేర్కొన్నారు అనేది వెల్లడి కావలసి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version