Santiago Martin: ఈసారి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ తర్వాత స్థాయిలో మీడియాను ఆకర్షించిన వ్యక్తి పేరు శాంటియాగో మార్టిన్. ఇతడేమీ మామూలు వ్యక్తి కాదు. అన్ని రాజకీయ పార్టీలకు కావలసిన వాడు. భారీగా డబ్బున్నవాడు. అంతకుమించి పలుకుబడి ఉన్నవాడు. ఈ స్థాయి వ్యక్తిని మయన్మార్ లో కూలి అని ఎలా ప్రస్తావించారని.. మీకు అనుమానం రావచ్చు. దాని నివృతి కోసం ఈ స్టోరీ చదివేయండి.
లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబం నుంచి ఈసారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మార్టిన్ సతీమణి లీమారోస్ లాల్ గుడి నియోజకవర్గం నుంచి అన్న డీఎంకే తరఫున పోటీ చేసి గెలిచారు. ఈమె అన్న డీఎంకే పార్టీకి మహిళా విభాగ సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మార్టిన్ అల్లుడు అధవ్ అర్జున టీవీకే కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఇతడు విక్కీ వక్కం తాళం నుంచి విజయం సాధించారు. మార్టిన్ కుమారుడు చార్లెస్ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ కామరాజు నగర్ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన లాచీయ జననాయక కట్చి పార్టీ తరఫున పోటీ చేశారు.
మార్టిన్ ఇప్పుడంటే ఆగర్భ శ్రీమంతుడు. కానీ ఒకప్పుడు ఆయన మయన్మార్లో కూలి. 1988లో మన దేశానికి తిరిగి వచ్చాడు. తమిళనాడు రాష్ట్రంలో లాటరీ వ్యాపారం ప్రారంభించాడు. ఆ తర్వాత దానిని కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు విస్తరించాడు. ఆ తర్వాత ఈశాన్య భారతదేశం వెళ్లిపోయాడు. అక్కడ ప్రభుత్వాలతో కలిసి లాటరీ స్కీమ్ లు నిర్వహించాడు. భూటాన్, నేపాల్ ప్రాంతాలలో కూడా ఈ వ్యాపారాలు సాగించాడు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, టెక్స్టైల్, హాస్పిటాలిటీ రంగాల్లోకి ప్రవేశించాడు. ఈయన ఆధ్వర్యంలో ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనసాగుతోంది. దీనికి వరల్డ్ లాటరీ అసోసియేషన్ లో మెంబర్షిప్ ఉంది. క్యాసినో, ఆన్లైన్ గేమింగ్ వంటి వాటిని ఇది నిర్వహిస్తూ ఉంటుంది.
మార్టిన్ లాటరీ స్కీమ్ లతో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అయితే అందులో మోసాలకు పాల్పడ్డాడు. వేలకోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. నీతో కేంద్ర దర్యాప్తు సంస్థలు అతని కార్యాల మీద దాడులు చేశాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన ఆదాయంతో మార్టిన్ కోట్లు ఖర్చుపెట్టి ఆయా రాజకీయ పార్టీల బాండ్లు కొనుగోలు చేశారు. 2019, 24 కాలంలో అనేక రాజకీయ పార్టీలకు ఈయన విరాళాలు ఇచ్చాడు.