మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పట్ల ఎం.ఎన్. ఓ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లా చల్లపల్లి ప్రాంతానికి చెందిన నాగరాణి (26) రెండు రోజుల కిందట కాలిన గాయాలతో మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంది.
వార్డులో ఒంటరిగా ఉన్న నాగరాణి చూసి విచక్షణా జ్ఞానం కోల్పోయిన ఎం.ఎన్.ఓ (మేల్ నర్సింగ్ ఆక్సిలరీ) వెంకటేశ్వరరావు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు ఆసుపత్రి సూపరిండెంట్ కు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన తరువాత నాగరాణి భర్త సురేష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సూచన మేరకు మేల్ నర్సింగ్ ఆక్సిలరీ వెంకటేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎం.ఎం.ఓ వెంకటేశ్వరరావును పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.