seetakka in assembly
Also Read: మళ్లీ రవి ప్రకాష్ చేతికి టీవీ 9..?
సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ నేతల వైఖరిపై నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ‘మన అసెంబ్లీ ఎదుట చనిపోయిన వ్యక్తికి నివాళి అర్పించలేనంత తీరిక లేకుండా ఉన్నరా..? ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, గౌరవించాలని కోరుతున్నా. అతని పేరే తెలంగాణ నాగులు. అతని డెడ్ బాడీ మీద కూడా టీఆర్ఎస్ జెండా ఉంది. మీ వాళ్లు ఎవరూ పోలేదు. ఉద్యమకారులను గౌరవించండి. వాళ్లు ఎందుకు చనిపోతున్నారో.. వాళ్ల డిమాండ్లు ఏమిటో వినండి. ఆహో, ఓహో అని డబ్బా కొట్టుకునేందుకే అసెంబ్లీ నడుపుతున్నరు. ప్రజాసమస్యల ప్రస్తావనకు అవకాశం ఎక్కడ ఇస్తున్నారు’ అంటూ నిలదీశారు.
హోం మినిష్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీతక్క.. సభాముఖంగా నాగులుకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త కూడా నాగులు కుటుంబాన్ని పరామర్శించకపోవడం సరైంది కాదని అన్నారు.
Also Read: ఏమైనా కెసిఆర్ కి తిరుగులేదేమో
కరోనా వల్ల అన్ని రంగాలకూ తీవ్ర నష్టం వాటిల్లిందని సీతక్క అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పథకాలపై గొప్పలు చెప్పుకోవడం కాదు.. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని చురకలు అంటించారు. రాష్ట్రంలో అన్నీ బాగుంటే .. ఇక అసెంబ్లీ ఎందుకని..అన్నీ డబ్బాలు కొట్టుకోవడానికే టీఆర్ఎస్ నేతలు సభ సమయాన్ని వృథా చేస్తున్నారని ఝలక్ ఇచ్చారు.