మాంసం కోసం మహిళను కొట్టి చంపిన వ్యక్తి

మాంసం కూర వండకపోవడం ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించి వ్యక్తి మాంసం కూర వండలేదని ఒక మహిళను కర్రతో కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంపచోడవరం మండలంలోని సిరిగిందలపాడుకు చెందిన లక్ష్మి జగ్గంపేట మండలంలోని మల్లిశాలలోని ఓ జీడిమామిడి తోటలో కాపలాదారుగా పనిచేస్తోంది. సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశ్ కూడా అదే తోటలో పనిచేస్తున్నాడు. […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 12:25 pm
Follow us on

మాంసం కూర వండకపోవడం ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించి వ్యక్తి మాంసం కూర వండలేదని ఒక మహిళను కర్రతో కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంపచోడవరం మండలంలోని సిరిగిందలపాడుకు చెందిన లక్ష్మి జగ్గంపేట మండలంలోని మల్లిశాలలోని ఓ జీడిమామిడి తోటలో కాపలాదారుగా పనిచేస్తోంది.

సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశ్ కూడా అదే తోటలో పనిచేస్తున్నాడు. దీంతో గత కొంతకాలంగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఆ మత్తులో ఇంటికి వచ్చిన వెంకటేశ్ ఆదివారం కూడా మాంసం కూర ఎందుకు వండలేదని లక్ష్మితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వెంకటేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకుని లక్ష్మిపై దాడిచేశాడు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మి నిన్న ఉదయం మృతి చెందింది. ఆమె కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.