Homeజాతీయ వార్తలుWoman Arrested: గొంతుమార్చింది.. యువకుడి ప్రాణాలు తీసింది

Woman Arrested: గొంతుమార్చింది.. యువకుడి ప్రాణాలు తీసింది

Man suicide in WarangalWoman Arrested: ఆకతాయి చేష్టలతో ఓ అమ్మాయి (Woman) అమాయకుడి ప్రాణాలు తీసింది. తను చెప్పే మోసాలు కానక చివరికి ఊపిరే తీసుకున్నాడు. అబద్దమని తెలిసినా ఆమె తన వికృత చేష్టలతో అతడి మనసు గాయపరచింది. ఇక ఈ లోకంలో తనకు ఏం లేదని భావించిన అతడు ప్రాణాలొదిలాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తప్పుకు తగిన శిక్ష పడాల్సిందే. అనవసరంగా ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. తప్పుడు మాటలతో క్షమించరాని తప్పు చేసింది. చివరకు కటకటాలపాలైంది.

వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన సందీప్ (Sandeep) మృతికి కారణమైన యువతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మంద స్రవంతి, సందీప్ అక్క ఐదో తరగతి వరకు పాలకుర్తిలోని ఓ పాఠశాలలో చదివారు. దీంతో సందీప్ కు స్రవంతితో పరిచయం ఏర్పడింది. సందీప్ ఆమెను అక్క అని పిలిచేవాడు. ఈక్రమంలో ఏడు నెలల క్రితం సందీప్ ఆమెకు ఫోన్ చేయగా గొంతు మార్చి మరో అమ్మాయిగా మాట్లాడింది.

అతడిని ఆట పట్టించేందుకు ఆమె పేరు కావ్యగా పరిచయం చేసింది. దీంతో ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీనికి ఆమెకు వివాహమైంది మరచిపో అని చెప్పింది. ఈ నేపథ్యంలో సందీప్ మరో అమ్మాయిని ప్రేమించాడు. కానీ కొన్ని రోజులకు కావ్య భర్తకు విడాకులిచ్చింది నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని పేర్కొంది. కొద్ది రోజులకు కావ్య ఆత్మహత్య చేసుకుందని కావాలంటే ఆమె సోదరితో మాట్లాడు అని మరో అమ్మాయితో మాట్లాడించింది.

ఆమె మృతికి నీవే కారణమని వారి బంధువులు మీ ఇంటికి వస్తున్నారని బెదిరించింది. ఆందోళన చెందిన సందీప్ ఈనెల 13న స్వగ్రామంలో విషం తాగి 18న మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు స్రవంతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రాయపర్తి ఎస్సై బండారి రాజు, పీఎస్సై వడ్డే సందీప్ తెలిపారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

EPFO News

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...
Jogi Ramesh daughter In Law

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Vangaveeti Radhakrishna

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....
Oktelugu Epaper