మహబూబాబాద్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన మహిళ(32)కు 2006లో పెళ్లయింది. కానీ కుటుంబ గొడవల నేపథ్యంలో భర్తను వదిలేసింది. దీంతో ఒంటరిగా ఉంటున్న ఆమెపై అతడి కన్ను పడింది. ఎలాగైనా సరే వశపరచుకోవాలని కన్ను వేశాడు. అదే గ్రామానికి చెందిన సెంట్రింగ్ పనిచేసే చేతమాల కృష్ణ(35) ఆమెను చేరదీశాడు. అప్పటికే ఆమెకు కుమారుడు (17), కుమార్తె (15) ఉన్నారు.
అయితే ఉపాధి కోసం ఉన్నఊరును వదిలి హైదరాబాద్ కు వలస వచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు . అయితే సజావుగా సాగుతున్న వీరి సంసారంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. బోనాల పండుగ నేపథ్యంలో మెట్టుగూడ ప్రాంతంలో ఉంటున్న మహిళ తల్లి ఇంటికి కుమార్తెను పంపింది.
ఆమె తిరిగి వచ్చినప్పటి నుంచి కుమార్తె ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లి ఆరా తీసింది. దీంతో కృష్ణ చేసిన దారుణాన్ని వివరించింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె అతడిని నిలదీసింది. దీంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పోక్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.