Mahesh Babu and Keerthy Suresh: ‘సర్కారు’లో మహేష్ – కీర్తి పెళ్లి !

Mahesh Babu and Keerthy Suresh: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ( Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ రేపటి నుండి స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో ఫ్యామిలీ సీన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ ఎక్కువగా మహేష్ – కీర్తి సురేష్ మధ్య సాగుతాయట. ఈ సీన్స్ లో మహేష్ – కీర్తి పెళ్లి కూడా ఉంటుందట. పెళ్ళికి సంబంధించిన సెట్ ను తోట తరుణీ రామానాయుడు స్టూడియోలో […]

Written By: admin, Updated On : August 31, 2021 2:48 pm
Follow us on

Mahesh Babu and Keerthy Suresh: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ( Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ రేపటి నుండి స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో ఫ్యామిలీ సీన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ ఎక్కువగా మహేష్ – కీర్తి సురేష్ మధ్య సాగుతాయట. ఈ సీన్స్ లో మహేష్ – కీర్తి పెళ్లి కూడా ఉంటుందట. పెళ్ళికి సంబంధించిన సెట్ ను తోట తరుణీ రామానాయుడు స్టూడియోలో నిర్మించినట్లు తెలుస్తోంది.

సెన్స్ బుల్ సినిమాల దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ క్రేజీ సినిమాలో భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల ప్రస్తావన కూడా ఉండబోతుంది. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకుగా నటించబోతున్నాడు. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి తిరిగి ఆ డబ్బును ఎలా రాబట్టాడు అనేది సినిమాలో వెరీ ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది.

ఆ మధ్య దుబాయ్ షెడ్యూల్ లో ఈ బ్యాంక్ సీన్స్ నే షూట్ చేశారు. సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయట. మొత్తం ఈ సినిమాలో రెండు సీక్వెన్స్ లు హైలైట్ గా ఉండనున్నాయి. ఒకటి బ్యాంక్ సీక్వెన్స్, రెండు ఫ్యామిలీ సీక్వెన్స్. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ సీక్వెన్స్ నే షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయితే, సినిమాలో కీలక భాగం పూర్తి అయినట్టే.

ఇక రీసెంట్ గా జరిగిన ‘గోవా’ షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటు విలన్స్ పై కూడా భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు. రామ్ – లక్ష్మణ్ మాస్టర్లు ఈ యాక్షన్ పార్ట్ ను చాలా కొత్తగా కంపోజ్ చేస్తూ చేశారట. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్స్ కూడా సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయట.

ఎలాగూ కీర్తి సురేష్ ( Keerthy Suresh) – మహేష్ కలయికలో వచ్చే ప్యూర్ రొమాంటిక్ ట్రాక్ కూడా బాగుంటుంది కాబట్టి, ఏ రకంగా చూసుకున్న ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉంది. అన్నట్టు కీర్తి సురేష్ ఈ సినిమాలో కళావతి అనే పాత్రలో కనిపించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.