Made in Pakistan bedsheet issue in Pune: మహారాష్ట్రలోని ఒక సాధారణ జాతర కొనుగోలు చేసిన ఒక వస్తువు భారతీయుల జాతీయ భావనలను, భద్రతా ఆందోళనలను, వాణిజ్య నియంత్రణలను ఏకేసారి ప్రశ్నించే స్థాయికి చేరుకుంది. పూణేలోని పింప్రి–చించ్వాడ్లోని ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయం వద్ద జరిగిన సంకష్ట చతుర్థి జాతరలో ఒక మహిళ కొన్న బెడ్షీట్పై రహస్యంగా ఉన్న ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ లేబుల్ బయటపడింది. ఇది దేశంలోని అక్రమ వాణిజ్య వ్యవస్థ ఎంత సున్నితంగా, ఎంత సాహసోపేతంగా పనిచేస్తోందన్న హెచ్చరిక.
వాష్ చేసే సమయంలో..
మహిళ ఇంటికి వచ్చి బెడ్షీట్ను తొలి సారి వాష్ చేసినప్పుడు మూలలో దాచిన లేబుల్ స్పష్టంగా కనిపించింది. ఆమె వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. జాతరలో కొనుగోలు సమయంలో లేబుల్ కనిపించలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా దాచి అమ్ముతున్నారని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి, కోపం కలిగించింది. హిందూ ఆలయ జాతరలో పాకిస్తాన్ ఉత్పత్తి విక్రయం అనేది కేవలం వాణిజ్య ఉల్లంఘన కాదు, జాతీయ భావాలకు గాయం.
స్పందించిన పోలీసులు..
పింప్రి–చించ్వాడ్ పోలీసులు తక్షణం స్పందించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బెడ్షీట్ను అమ్మిన వీధి వ్యాపారి ఎవరు? ఆ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మార్గంలో స్థానిక మార్కెట్లోకి ప్రవేశించింది? అనే సప్లై చైన్ను పూర్తిగా ఛేదించాలని నిర్ణయించారు. అంతేకాకుండా, పింప్రి–చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు లేఖ రాసి జాతరలు, ఆలయ పరిసరాల్లో అనధికారిక వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని నెలల క్రితమే ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్)లో ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ కాస్మెటిక్ ఉత్పత్తులు విక్రయించిన ముగ్గురు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ.60 వేల విలువైన సరుకు సీజ్ చేశారు. ఇలాంటి సంఘటనలు ఒక పెద్ద, సంఘటిత అక్రమ నెట్వర్క్ ఉన్నట్టు తెలియజేస్తున్నాయి.
పుల్వామా ఘటన తర్వాత రద్దు..
2019 పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్థితిని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్ నుంచి దిగుమతులు దాదాపు పూర్తిగా నిషేధించబడ్డాయి. అయినప్పటికీ ఇలాంటి వస్తువులు దేశంలోకి వస్తున్నాయంటే ఇది సరిహద్దు భద్రత, కస్టమ్స్, ఇంటెలిజెన్స్ యంత్రాంగాల్లో ఉన్న లోపాలను సూచిస్తోంది. డబాయ్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల ద్వారా భారత్లోకి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.
వోకల్ ఫర్ లోకల్ కేవలం నినాదం కాకుండా వాస్తవ అమలులోకి రావాలి. జాతరలు, స్థానిక మార్కెట్లు, ఆలయ పరిసరాల్లో విక్రయించే ప్రతి ఉత్పత్తిపై కఠిన నిఘా అవసరం. వినియోగదారులు కూడా లేబుల్స్ను జాగ్రత్తగా చదవాలి. ఒక్క బెడ్షీట్ ఘటన దేశ ఆర్థికం మాత్రమే కాదు జాతీయ భద్రత, స్వావలంబన, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి పెద్ద సమస్యలను మన ముందుకు తెచ్చింది. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, స్థానిక పరిపాలన కలిసి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.
पुणे के चिंचवड़ में मोरया गोसावी मंदिर के संकष्टी चतुर्थी के दिन मेले में मेड इन पाकिस्तान चीजों की बिक्री
हिंदू महिला ने किया उजागर वीडियो हुआ वायरल pic.twitter.com/JN859goEf9
— Amrendra Bahubali (@TheBahubali_IND) June 5, 2026
