Homeజాతీయ వార్తలుLok Sabha Election Results 2024: ఈవీఎం కౌంటింగ్‌ ప్రారంభం..

Lok Sabha Election Results 2024: ఈవీఎం కౌంటింగ్‌ ప్రారంభం..

Lok Sabha Election Results 2024: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఈవీఎం కౌంటింగ్‌ మొదలైంది. తొలి ఫలితం మధ్యాహ్నం 1 గంట వరకు వెలువడే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్‌ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. గరిష్టంగా హైదరాబాద్, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో 24 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుంది. అత్యల్పంగా నిజామాబాద్‌లో 15 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుంది. ప్రతీ అరగంటకు ఒక రౌండ్‌ ఫలితం వస్తుందని అధికారులు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ బీజేపీ నువ్వా నేనా…
తెలంగాణలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఇక ఈవీఎం కౌంటింగ్‌లోనూ ఇదే ట్రెండ్‌ కనబడుతోంది. మొదటి రౌండ్‌లో బీజేపీ 9 లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా, అధికార కాంగ్రెస్‌ నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఎంఐఎం హైదరాబాద్‌లో ఆధిక్యత కనబర్చింది.

– ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి నగేశ్‌ ఈవీఎంలలోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

– మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌ పోస్టల్‌ బ్యాలెట్లలో 6 వేలకుపైగా లీడ్‌ సాధించగా, ఈవీఎం తొలి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యం సాధించారు.

– సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతోపాటు ఈవీఎం తొలి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు.

– కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ పోస్టల్‌ బ్యాటెల్‌ ఓట్లతోపాటు తొలిరౌండ్‌ ఈవీఎం ఓట్లలో ముందంజలో ఉన్నారు.

– మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి అరుణ పోస్టల్‌ బ్యాలెట్‌తోపాటు ఈవీఎంలో కూడా వంశీచందర్‌రెడ్డి కన్నా ముందు ఉన్నారు.

– నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ కౌంటింగ్‌లో దూసుకుపోతున్నారు. అటు పోస్టల్, ఇటు ఈవీఎం కౌంటింగ్‌లో స్పష్టమైన ఆధిక్యత కనబర్చారు.

– వరంగల్‌లో ఈవీఎం కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ లీడ్‌లోకి వచ్చారు. పోస్టరల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య ఆధిక్యం కనబర్చారు.

– మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు లీడ్‌లోకి వచ్చారు. ఇక్కడ పోస్టల బ్యాలెట్‌లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబర్చింది. తొలి రౌండ్‌లో బీజేపీ ముందంజలో నిలిచింది.

– చేవెళ్లలో బీజేఈపీ అభ్యర్థి లీడ్‌లోకి వచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో వెనుక పడినా, తొలి ఈవీఎం రౌండ్‌లో ముందుకు వచ్చారు.

– పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణ స్వల్ప మెజారిటీతో ముందజలో ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్, ఈవీఎంలలో కలిపి 800 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

– ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి భారీ ఆధిక్యం కనబరుస్తున్నారు పోస్టల్, ఈవీఎం రెండు రౌండ్లు కలిసి 46 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

– భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడి ఆధిక్యంలో ఉంది. ఇక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌తోపాటు ఈవీఎం ఓట్లలో కూడా కాంగ్రెస్‌ ముందు ఉంది.

– మహబూబ్‌బాద్‌లో బలరామ్‌నాయక్, జహీరాబాద్‌ సురేష్‌ షట్కర్, నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి కూడా కాంగ్రెస్‌ లీడ్‌ కొనసాగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version