Rajesh Exports Scam: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. భారతీయులు పొదుపు చేసిన డబ్బు ద్వారా ఈ స్థాయికి ఎగిరింది. ఎల్ఐసికి ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది. అటువంటి ఈ సంస్థ దాదాపు 3 వేల కోట్లు నష్టపోయింది. రాజేష్ ఎక్స్పోర్ట్ సంస్థ మోసానికి బలైపోయింది. సెబి బయటపెట్టిన వివరాల ద్వారా రాజేష్ ఎక్స్పోర్ట్ సంస్థ మోసం బయటపడగా.. ఎల్ఐసి ఏకంగా 3000 కోట్లు నష్టపోయింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఎల్ఐసి కి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
రాకేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ఎల్ఐసి 10.8 శాతం వాటాలో సమానమైన షేర్లు కొనుగోలు చేసింది.. ఈ కంపెనీకి సంబంధించిన షేర్ ధర పడిపోతున్నప్పటికీ విక్రయించలేదు. ఇలా ఎందుకు విక్రయించలేదో అర్థం కాని పరిస్థితి. 2019 అక్టోబర్, 2021 మే మధ్యలో ఒక్కొక్క షేర్ కు దాదాపు 700 నుంచి 1000 వరకు చెల్లించి 3.19 కోట్ల షేర్లను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సొంతం చేసుకుంది. ఒక దశలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ షేర్ ధర 1029 కు చేరుకుంది. ఇది జీవిత కాల గరిష్టంగా నమోదయింది. అయినప్పటికీ ఎల్ఐసి వాటిని అమ్మలేదు. ఎందుకు అమ్మ లేదో తెలియదు. దీని వెనక ఎవరు ఉన్నారో తెలియదు.
రాజేష్ కంపెనీ 2019లో 1861 కోట్ల నిర్వహణ లాభాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది నాటికి 285 కోట్లకు కంపెనీ లాభం పడిపోయింది. లక్షల కోట్లలో వ్యాపారం చేస్తున్నామని ఆ కంపెనీ చెప్పినప్పటికీ.. లాభం 0.1 శాతానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఈ ప్రకారం కోటి రూపాయలు వ్యాపారం చేస్తే కేవలం 10,000 వరకే లాభం వచ్చినట్టు లెక్క..
రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించిన షేర్లను మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. ఇతర పెట్టుబడిదారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.. ఇక ఎల్ఐసి కూడా తమ వద్ద అద్భుతమైన పరిశోధన బృందం ఉందని.. షేర్లు కొనుగోలు చేస్తున్నప్పుడు ఒకటికి 1000 సార్లు ఆలోచిస్తామని చెబుతూ ఉంటుంది. కానీ రాజేష్ ఎక్స్పోర్ట్ కంపెనీ విషయంలో ఎక్కడ తప్పు జరిగింది.. ఎల్ఐసి కంపెనీని ఎవరు మిస్ లీడ్ చేశారు అనేది అర్థం కావడం లేదు. ఈ కంపెనీ ఏకంగా వేల కోట్ల రూపాయల విలువచేసే రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ షేర్లు కొనుగోలు చేసింది..
సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఈ కంపెనీ షేర్ ధర 1029 కు చేరుకుంది. నాటి రోజుల్లో ఆ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 30 వేల కోట్లకు పైగా ఉండేది. ఇప్పుడు కంపెనీ షేర్ ధర 103.92 పడిపోయింది. దీంతో కంపెనీ విలువ కూడా 3070 కోట్లకు తగ్గిపోయింది. ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు ఎల్ఐసి వద్ద ఉన్నాయి. వాటి విలువ నాటి రోజుల్లో 3280 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడు అది 330 కోట్లకు పడిపోయింది. ఈ ప్రకారం ఎల్ఐసి దాదాపు 3 వేల కోట్లు నష్టపోయింది.
ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు భర్త చేస్తారు.. ముందస్తు అంచనా వేయకుండా షేర్లు కొనుగోలు చేయమని చెప్పింది ఎవరు.. అసలు ఎటువంటి బ్యాలెన్స్ షీట్ చూడకుండానే షేర్లు కొనుగోలు చేస్తే తదుపరి నష్టాలకు బాధ్యులు ఎవరు.. అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఇంత జరిగినప్పటికీ ఎల్ఐసి నుంచి ఇంతవరకు ఒక ప్రకటన కూడా రాలేదు. దీనినిబట్టి ఆ సంస్థ నిర్వహణ ఎంత అద్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
