spot_img
Homeజాతీయ వార్తలుBL Santhosh- KCR: కేసీఆర్ లెక్కలన్నీ బీఎల్ సంతోష్ చేతిలో: అందుకే తెలంగాణకు వచ్చి కాలర్...

BL Santhosh- KCR: కేసీఆర్ లెక్కలన్నీ బీఎల్ సంతోష్ చేతిలో: అందుకే తెలంగాణకు వచ్చి కాలర్ ఎగరేస్తున్నాడు

BL Santhosh- KCR: ” ఏమోయ్ కేసీఆర్… మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ నువ్వే రచించి… నా మీద కేసు పెట్టిస్తావా? నన్నే బజారుకు లాగాలని చూస్తావా? నీ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇక చూసుకుందాం అంటూ” బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గుడ్లు ఉరిమాడు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తనను ఇరికించారని కోపమో, తనను అనవసరంగా బద్నాం చేశారని ఆగ్రహమో తెలియదు కానీ కెసిఆర్ మీద ఒంటి కాలి పై లేచాడు. అంతేకాదు తెలంగాణ డబ్బును ఇతర రాష్ట్రాల్లో ఎంత ఇచ్చారో లెక్క తన దగ్గర ఉందని, తగిన సమయంలో బయటపెడతామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అటు భారత రాష్ట్ర సమితి, ఇటు భారతీయ జనతా పార్టీ మధ్య వైరం మరింత పాకాన పడింది.

BL Santhosh- KCR
BL Santhosh- KCR

తప్పుడు ఆరోపణలు

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తనను అనవసరంగా ఇరికించారని బిఎల్ సంతోష్ అంటున్నారు. ఏకంగా తెలంగాణ గడ్డమీదికి వచ్చి కేసిఆర్ కు సవాళ్లు విసురుతున్నారు.. అంతేకాదు పాడి ఆవు లాంటి తెలంగాణను వాడుకొని తర్వాత ఏదో ఒక రోజు చంపేస్తారని జోస్యం చెప్పారు..” అదేమైనా ఆయన కష్టపడి వ్యాపారం చేసి సంపాదించిన డబ్బా? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇచ్చి వస్తున్నారా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది? ఇతర రాష్ట్రాల్లో వెదజల్లుతున్న డబ్బు అంతా తెలంగాణ తల్లి పేరు చెప్పి దోచుకున్నది కాదా” అని తీవ్రమైన పదాలతో కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బెంగాల్ ఎన్నికల్లో మమతకు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో తమ వద్ద సమాచారం ఉందని బిఎల్ సంతోష్ బాంబు పేల్చారు.

సొంత పార్టీ నేతలకు కూడా క్లాస్

కాస్త జనాల్లో ప్రాబల్యం పెరిగే సరికి బిజెపి నాయకులు ఎవరికి వారు వేరుకుంపట్లు పెట్టుకున్నారు. దీనివల్ల పార్టీ పురోగతి క్షేత్రస్థాయిలో ఆశించినత మేర లేదు. దీనిపై బీఎల్ సంతోష్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈర్ష్య, ద్వేషాలు వద్దని ముఖ్య నేతలకు హితవుపలికారు.. జూనియర్, సీనియర్ నాయకులు తారతమ్యాలు చూపొద్దని మందలించారు.. గంగ, యుమున నదులు ప్రయోగ వద్ద కలిశాక 15 కిలోమీటర్ల వరకు రెండు నదుల నీటి తేడా కనిపిస్తుందని, తర్వాత రెండూ కలిసిపోతాయని గుర్తు చేశారు.. బిజెపిలోకి కొత్తగా చేరిన వారికి ఇక్కడి సిద్ధాంతాలు పార్టీ పని తీరు కొత్తగా అనిపించవచ్చని, కొద్ది రోజుల తర్వాత వారు కలిసిపోతారని వివరించారు.

BL Santhosh- KCR
BL Santhosh- KCR

బీఆర్ఎస్ వల్లే నాకు గుర్తింపు

అంతకుముందు తనను ప్రోటోకాల్ ప్రకారం ఒకరు ఇద్దరు నాయకులు వచ్చి స్వాగతం పలికేవారు.. కానీ భారత రాష్ట్ర సమితి నాయకుల కారణంగా బిఎల్ సంతోష్ అంటే ఎవరో తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.. విమానాశ్రయంలో తనకు వేలాది మంది కార్యకర్తలు వచ్చి స్వాగతం పలికారని సంతోష్ గుర్తు చేసుకున్నారు.. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రాచుర్యం కల్పించిందని చలోక్తి విసిరారు.. ఫామ్ హౌస్ కేసులో తనను అక్రమంగా ఇరికించిన వారు తప్పనిసరిగా పర్యవసనాలు అనుభవిస్తారని ఆయన వెల్లడించారు.. అయితే ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగ ప్రవేశం చేయడంతో బిఎల్ సంతోష్ తన స్వరాన్ని మరింత పెంచారు. మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా కోరల్లేని పాము కావడంతో కెసిఆర్ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. సంతోష్ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version