KCR YS Sharmila: దళితుల ఎఫెక్ట్.. వైఎస్ షర్మిలను ఊరికే వదలొద్దని కేసీఆర్ డిసైడ్?

KCR YS Sharmila: తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ కు ఏకుమేకవుతున్నాయి. కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు బీజేపీ నుంచి బండి సంజయ్.. ఇటు కొత్తగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. మధ్యలో వైఎస్ షర్మిల, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ లు చికాకు పెడుతున్నారు. ఇన్నాళ్లు వీరందరినీ లైట్ తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడు అదే పనిచేస్తే తాను మునిగిపోతానన్న వాస్తవాన్ని గ్రహించినట్టున్నారు. చర్యలు చేపట్టారు.. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ‘దళిత’ జపం చేస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : October 8, 2021 6:12 pm
Follow us on

KCR YS Sharmila: తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ కు ఏకుమేకవుతున్నాయి. కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు బీజేపీ నుంచి బండి సంజయ్.. ఇటు కొత్తగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. మధ్యలో వైఎస్ షర్మిల, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ లు చికాకు పెడుతున్నారు. ఇన్నాళ్లు వీరందరినీ లైట్ తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడు అదే పనిచేస్తే తాను మునిగిపోతానన్న వాస్తవాన్ని గ్రహించినట్టున్నారు. చర్యలు చేపట్టారు..

సీఎం కేసీఆర్ ప్రస్తుతం ‘దళిత’ జపం చేస్తున్నారు. దళితుల పట్ల ప్రత్యేక అభిమానాన్ని పెంపొందించుకున్నాడు. గొప్ప దళిత బంధు పథకాన్ని ప్రకటించాడు. అసెంబ్లీలో ఆయన దళితులకు రిజర్వేషన్ కోటాను పెంచాలని కేంద్రానికి సిఫారసు చేయడమే కాకుండా.. తదుపరి బడ్జెట్ లో ‘దళిత బంధు’ పథకానికి 1.8 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఇది ఏమాత్రం ఊహించనంత చిన్న మొత్తం కాదు.. మరియు ఈ పథకానికి వనరులు ఎక్కడ లభిస్తాయనే ప్రశ్న వినిపిస్తోంది.

అయితే కేసీఆర్ అన్నట్టు తెలంగాణ ధనిక రాష్ట్రం.. ఆ మాత్రం డబ్బులు కేసీఆర్ తేలేడా? దాన్ని భరించలేడా? అని కొందరు అంటున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర భారీ రుణభారాన్ని మోస్తోంది. తట్టుకోలేకపోతోందని అంటున్నారు. కరోనా దెబ్బకు ఇంకా కుదేలైంది. రుణభారం గురించి కేసీఆర్ ఎన్నో సార్లు నెత్తినోరు కొట్టుకున్నారు. అయితే దళితులపై హుజూరాబాద్ ఉపఎన్నికల సందర్భంగా పుట్టుకొచ్చిన ఆకస్మిక ప్రేమ ఖరీదును కేసీఆర్ ఎలా భరిస్తాడన్నది ఇప్పుడు వేచిచూడాలి.

రేవంత్ రెడ్డి, సంజయ్ నుంచి కేసీఆర్ ఇప్పటికే తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన వైఎస్ షర్మిల ఇప్పుడు కేసీఆర్ కు కొత్త టార్గెట్ గా మారారట.. వైఎస్ షర్మిల మూడోసారి కేసీఆర్ ఆశయాలకు గండికొడుతున్నారట.. ఓ వర్గం వారిని వ్యతిరేకంగా మార్చేస్తున్నారని కేసీఆర్ అనుమానిస్తున్నారట..

తెలంగాణలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులున్నారు. మొదట్లో షర్మిల తన పార్టీని ప్రకటించినప్పుడు సమీప భవిష్యత్తులో ఆమె ఎలాంటి ప్రభావం చూపలేదని భావించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ షర్మిల పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ఎన్నికలను ప్రభావితం చేయగలదని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.

రిజర్వేషన్లు పొంది క్రైస్తవ మతంలోకి మారిన దళితులు తెలంగాణలో భారీ సంఖ్యలో ఉన్నారు. కానీ బహిరంగంగా తమ రిజర్వేషన్ హక్కులు కోల్పోతామనే భయంతో వారంతా హిందువులుగా చెప్పుకుంటున్నారు. సహజంగానే షర్మిల పార్టీ కనుక ఎన్నికల్లో పోటీచేస్తే క్రైస్తవులు లేదా దళితులు ఆమెకు మూకుమ్మడిగా ఓటు వేస్తారు.. వారికి లోకల్, నాన్ లోకల్ అనే ప్రశ్న ముఖ్యం కాదు.. ఇదే కేసీఆర్ ను కలవరపెడుతున్న అంశంగా మారింది.

కాంగ్రెస్ కు క్యాడర్ ఉంది.. అయితే ముస్లింలు ఎంఐఎంకు ఓటు వేస్తారు. బీజేపీ మైనారిటీల ఓట్లపై ఆధారపడదు. దళితులు/క్రైస్తవులు టీఆర్ఎస్ కు రెండు సార్లు ఓటు వేసి అధికారంలోకి రావడానికి సహకరించారు. తెలంగాణలో దళిత జనాభా పెద్ద సంఖ్యలో ఉంది. వీరంతా ఇప్పుడు షర్మిలకు మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇదే టీఆర్ఎస్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. షర్మిలను ఇక ఉపేక్షించవద్దని ఆమెను టార్గెట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోందట..

ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ప్రాబల్యం కూడా భారీగా పెరుగుతోందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దళితులు దూరం కాకుండా ‘దళితబంధు’ తీసుకొచ్చారని అంటున్నారు. దళితులు దూరం అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తీవ్ర నష్టమే అంటున్నారు.

ఏపీ ఎన్నికలకు నెలల ముందు చంద్రబాబు సైతం ప్రభుత్వ సొమ్మును పప్పు బెల్లాల్లా ‘పసుపు కుంకుమ’ పథకం పేరిట మహిళలకు పంచేశాడు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. డబ్బు తీసుకున్న వారంతా జగన్ కు ఓటు వేసి గెలిపించారు. ఇప్పుడు ‘దళితబంధు’ కూడా అలానే మారుతుందా? అన్న భయం వెంటాడుతోందట.. తెలంగాణలో కూడా అదే జరిగితే ఈ పథకం కేసీఆర్ కు శరాఘాతంగా మారడం ఖాయమంటున్నారు.