spot_img
Homeజాతీయ వార్తలుKCR Chanakya strategy: కేసీఆర్ చాణక్య వ్యూహం.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు నయా ప్లాన్..

KCR Chanakya strategy: కేసీఆర్ చాణక్య వ్యూహం.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు నయా ప్లాన్..

KCR Chanakya strategy: ప్రత్యర్థులను ఇరుకున పెట్టి దాడి చేయడం రాజకీయ పార్టీల ప్రధాన లక్షణం అని చెప్పొచ్చు. ఏదేని పొలిటకల్ పార్టీ ప్రజల్లో ఉండాలంటే ఇందుకుగాను వ్యూహాలను రచించుకుంటుంది. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకుగాను తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నయా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఈ మేరకు పార్టీ వర్గాలను, నేతలను అప్రమత్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్ వేసిన నయా ప్లాన్ ఏంటంటే..

KCR Chanakya strategy
KCR Chanakya strategy

వానాకాలంతో పాటు యాసంగి వడ్ల కొనుగోలు విషయమై గత కొంత కాలంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు తమదే ముందు అడుగు ఉండాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రాన్నితప్పుబడుతూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. అలా ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్స్‌ను కేంద్రం ఒప్పుకున్నట్లయితే, అది తమ విజయంగా తెలంగాణలో ప్రచారం చేయొచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే తెలంగాణలో బీజేపీని మరింత టార్గెట్ చేయొచ్చనే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ పక్కాప్రణాళిక ప్రకారమే ముందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కేంద్రం మాత్రం మొదటి నుంచి ఒకటే వైఖరితో ఉన్నట్లు స్పష్టమవుతోంది. యాసంగి కొనుగోలు విషయం గురించి ఇప్పుడు చెప్పలేమని, అయితే, వానాకాలం టార్గెట్‌ను తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇంకా పూర్తి చేయలేదని అంటోంది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు.

Also Read: TRS vs BJP: ఆత్మగౌరవ నినాదం: కేంద్రం టార్గెట్.. మళ్లీ సెంటిమెంట్ రగిలిస్తున్న టీఆర్ఎస్

వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేయడంతో పాటు చివరకు సమావేశాలను కూడా బహిష్కరించారు. అలా సీఎం కేసీఆర్ వ్యూహం ప్రకారమే.. ఓ వైపు రాష్ట్రస్థాయిలో టీఆర్ఎస్ శ్రేణులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. మరో వైపున దేశ రాజధానిలో టీఆర్ఎస్ మంత్రులు, నేతలు కేంద్రమంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా బీజేపీని ఇరుకున బెట్టే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. తాము గతంలో చెప్పిన విషయాలకు కట్టుబడి ఉన్నామని, యాసంగి కొనుగోలుకు సంబంధించిన టార్గెట్ అప్పుడే చెప్తామని, యాసంగి ధాన్యం టార్గెట్ పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే, ధాన్యం కొనుగోలు విషయమై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, అప్పటి వరకు తాము ఢిల్లీ వదలి వెళ్లబోమని టీఆర్ఎస్ మంత్రులు అనౌన్స్ చేశారు. చూడాలి మరి.. చివరికిఏం జరుగుతుందో ..

Also Read: Kodurupaka Village: సాయంత్రం లేని తెలంగాణలోని ఈ ఊరి గురించి తెలుసా..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper