
కరోనా వ్యాపించకుండా రోడ్లను ఊడుస్తూ, వీధులను, గల్లీలను శుభ్రం చేస్తూ.. బ్లీచింగ్ పౌడర్ ను చల్లుతూ జాగ్రత్త పడుతున్నవారికి సీఎం కెసిఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి ప్రోత్సాహకం అందజేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్డబ్ల్యూలో పనిచేస్తున్న వారికి రూ.7500, గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి రూ.5వేలు ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే సీఎం స్పెషల్ ఇన్సెంటివ్ నిధులు విడుదలయ్యాయి. ప్రతి కార్మికుడి ఖాతాల్లోకి నేటి నుంచి రూ.5వేలు జమకానున్నాయి. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.21.84 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో సఫాయి కర్మచారులు 43,661 మంది, మునిసిపాలిటీల్లో 21,531మంది, హైదరాబాద్ వాటర్వర్క్స్ అండ్ సేవరేజ్ బోర్డులో 2510, జీహెచ్ఎంసీలో 20690 మంది.. మొత్తం 95,392 మంది పనిచేస్తున్నారు. వారందరికీ సీఎం గిఫ్ట్ అందనుంది. వారి జీతాల్లోనూ కోత పెట్టకుండా చర్యలు తీసుకున్నారు సీఎం.