spot_img
Homeజాతీయ వార్తలుJammu Kashmiri Pandits justice: జమ్ములో కశ్మీరి పండితులకు ఇన్ని రోజులకు జరిగిన న్యాయం

Jammu Kashmiri Pandits justice: జమ్ములో కశ్మీరి పండితులకు ఇన్ని రోజులకు జరిగిన న్యాయం

Jammu Kashmiri Pandits justice: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 అమలులో ఉన్న కాలంలో కశ్మీరీ పండితులపై జరిగిన అత్యాచారాలు, హత్యలు, నిర్బంధ గృహనిర్గమనం చరిత్రలో మరవలేని మచ్చ. ఆ సమయంలో వారి ఇళ్లు, భూములను స్థానిక నాయకులు, ఉగ్రవాదులు బలవంతంగా ఆక్రమించుకున్నారు. కొందరు నామమాత్ర ధరలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ చీకటి చరిత్రకు తెరపడుతోంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్‌ పండితులు వెనక్కి వస్తున్నారు. దీంతో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకుని కశ్మీరీ పండితులకు అప్పగించాలని నిర్ణయించింది. 3,500 ఎకరాల ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుని, వాటిని త్వరలోనే నిజమైన యజమానులైన కశ్మీరీ పండితులకు అప్పగించనుంది.

చీకటి చరిత్ర..
1990లలో ఉగ్రవాదం ఉధృతమైనప్పుడు కశ్మీరీ పండితులు లోయను వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉగ్రవాదులు కశ్మీరీ పండితులను చంపేశారు, మహిళలపై అత్యాచారాలు చేశారు. భయంతో లక్షల మంది తమ స్వంత గడ్డను వదిలి పారిపోయారు. వారు వెళ్లిపోయాక, వారి ఇళ్లు, వ్యవసాయ భూములను స్థానికులు, ఉగ్రవాదులు బలవంతంగా ఆక్రమించుకున్నారు. ఫారూఖ్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఒక చట్టం చేసి, కశ్మీరీ పండితుల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. దీంతో, ఫారూఖ్‌ అబ్దుల్లా పార్టీ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌) నాయకులే ఆ భూములను కొనుగోలు చేశారు. ఈ భూముల ఆక్రమణ కేవలం ఆర్థిక లాభం కోసం కాదు.. రాజకీయంగా కశ్మీరీ పండితులను శాశ్వతంగా లోయ నుంచి తరిమికొట్టడానికి కుట్రగా కూడా మారింది.

న్యాయం జరుగుతోంది..
ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కేంద్ర పరిపాలన ఈ అక్రమాలపై దృష్టి సారించింది. తాజాగా గణనీయమైన చర్యలు తీసుకుంది: కశ్మీర్‌ పరిపాలన మొత్తం 3,500 ఎకరాల ఆక్రమిత భూములను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఒక్క సోపియాన్‌ జిల్లా నుంచే 240 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అనేక కశ్మీరీ పండితుల ఇళ్లు, వ్యవసాయ భూములు ఉగ్రవాదులు, స్థానిక నాయకుల ఆక్రమణలో ఉన్నాయి. ఈ భూములను త్వరలోనే నిజమైన యజమానులైన కశ్మీరీ పండితులకు అప్పగించనున్నారు. దీని కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, పత్రాల పరిశీలన పూర్తి చేశారు.

3,500 ఎకరాల భూముల స్వాధీనం కశ్మీర్‌ చరిత్రలో ఒక మైలురాయి. ఆర్టికల్‌ 370 కాలంలో జరిగిన అన్యాయాలకు న్యాయం జరుగుతోంది. కశ్మీరీ పండితులు తమ స్వంత గడ్డపై తిరిగి కాలు మోపే రోజు దగ్గరలో ఉంది. ఇది కేవలం భూమి తిరిగి ఇవ్వడం కాదు.. గాయపడిన ఆత్మలకు న్యాయం చేయడం, కశ్మీర్‌లో శాశ్వత శాంతికి పునాది వేయడం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper