spot_img
Homeజాతీయ వార్తలుKarnataka DGP Ramachandra Rao: ఆఫీసులోనే బరితెగించిన డీజీపీ.. మహిళలతో రాసలీలలు.. సంచలన వీడియో వెలుగులోకి

Karnataka DGP Ramachandra Rao: ఆఫీసులోనే బరితెగించిన డీజీపీ.. మహిళలతో రాసలీలలు.. సంచలన వీడియో వెలుగులోకి

Karnataka DGP Ramachandra Rao: ఆయన ఒక రాష్ట్రానికి డిజిపి. శాంతి భద్రతల నుంచి మొదలుపెడితే అడ్మినిస్ట్రేషన్ వరకు పోలీసు విభాగంలో ప్రతిపని కూడా ఆయన ఆధీనంలో జరుగుతుంది. అయితే తన విధులను పక్కనపెట్టి ఆయన రాసలీలల కార్యక్రమం మొదలుపెట్టారు. తన విధి నిర్వహణకు కేంద్రమైన కార్యాలయాన్ని కామ కార్యాకాల పాలకు వేదికగా మార్చుకున్నారు. చివరికి సార్ బాగోతం బయటపడటంతో ఇప్పుడు తల దించుకున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో డీజీపీగా కొనసాగుతున్నారు రామచంద్రరావు. విధి నిర్వహణ విషయం పక్కన పెడితే అనేక ఆరోపణలు, వివాదాలతో ఆయన నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన సంబంధించిన ఒక వార్త జాతీయ మీడియా నుంచి మొదలు పెడితే కర్ణాటక మీడియా వరకు విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. ఆయన తన కార్యాలయంలో మహిళలతో నిర్వహించిన రాసలీలల వ్యవహారం సంచలనగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ డిజిపి పై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వీడియో బయటపడటంతో రామచంద్ర రావు స్పందించారు. అదంతా కూడా మార్ఫింగ్ వీడియో అని.. తాను అలాంటి ఘోరాలకు పాల్పడలేదని చెబుతున్నారు.. గిట్టని వ్యక్తులు ఇలాంటి పనికి పాల్పడి తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని రామచంద్రరావు వెల్లడించారు. మరోవైపు రామచంద్ర రావు కుమార్తె రన్యారావ్ ఇటీవల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆమె ఇప్పటికీ జైల్లోనే కొనసాగుతున్నారు. కుమార్తె చేసిన పని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. ఇప్పుడు రామచంద్రరావు కూడా రాసలీలల వ్యవహారంతో పరువు పోగొట్టుకున్నారు.

డిజిపి వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరకు వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులకు సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఆ వీడియోలో ఉన్న రామచంద్రరావు కుర్చీలో కూర్చొని.. మహిళలతో అనుచితంగా ప్రవర్తించినట్టు కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version