Kanna Laxminarayana : టీడీపీలో చేరిన ఎఫెక్ట్.. జనసేనతో పొత్తు కన్ఫమ్ చేసి జగన్ పై అటాక్ షురూ చేసిన ‘కన్నా’

Kanna Laxminarayana : ఇన్నాళ్లు బీజేపీలో ఉంటూ అటు జగన్ కు సన్నిహితంగా ఇటు చంద్రబాబుకు కోవర్ట్ లా కన్నా లక్ష్మీనారాయణ ఉంటున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే జగన్ తో బంధాన్ని తెంచుకొని చంద్రబాబు ఆఫర్ తో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఫైరింగ్ షురూ చేశాడు. టీడీపీలో చేరగానే.. అపర తెలుగుదేశం భక్తుడు అయిపోయాడని ఆయన మాటలను బట్టి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా జగన్ టార్గెట్ గా కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. […]

Written By: NARESH, Updated On : March 4, 2023 4:04 pm
Follow us on

Kanna Laxminarayana : ఇన్నాళ్లు బీజేపీలో ఉంటూ అటు జగన్ కు సన్నిహితంగా ఇటు చంద్రబాబుకు కోవర్ట్ లా కన్నా లక్ష్మీనారాయణ ఉంటున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే జగన్ తో బంధాన్ని తెంచుకొని చంద్రబాబు ఆఫర్ తో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఫైరింగ్ షురూ చేశాడు. టీడీపీలో చేరగానే.. అపర తెలుగుదేశం భక్తుడు అయిపోయాడని ఆయన మాటలను బట్టి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా జగన్ టార్గెట్ గా కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి.

తాజాగా గుంటూరులో టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. జగన్ పై నేరుగా ఆయన దాడి చేశాడు. ‘జగన్ లిక్కర్ కు ,అక్రమ ఇసుక మైనింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ ’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పులి అని చెప్పుకునే జగన్ పొత్తుల పై భయం ఎందుకు అంటూ ప్రశ్నించాడు. జగన్ అనే ఒక రాక్షస పాలన బ్రాండ్ చూసి పెట్టుబడులు ఎలా వస్తాయని నిలదీశారు.

‘ఇప్పటం ప్రజల మీద కక్ష సాధింపు జరుగుతుంది. ఈ ప్రభుత్వం కులగొట్టడాల తోనే ప్రారంభం అయ్యింది… ఈ ప్రభుత్వం ఒక్క కట్టడం ఎక్కడైనా కట్టారేమూ సమాధానం చెప్పాలి.. పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇవ్వడం ఇప్పటం ప్రజలు చేసిన తప్పా.. టిడిపి, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.. ’ అంటూ జనసేనతో పొత్తును కన్ఫమ్ చేశాడు కన్నా

జగన్ కు ఎన్నికల సంవత్సరం పెట్టుబడుల అంశం గుర్తుకు రావడం ఆశ్చర్యం గా ఉందని కన్నా విమర్శించాడు.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తె సంతోషమే… రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతుంది.. పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించాలి.. విశాఖలో పెట్టుబడి దారులకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టులో ఉన్న రాజధాని అంశాన్ని మభ్య పెట్టి విశాఖ రాజధాని చేస్తాను అని మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

ఇలా టీడీపీలో చేరగానే కన్నా లక్ష్మీనారాయణ ట్రాక్ మార్చేశాడు. ఫక్తు టీడీపీ వాదిగా మారి జనసేనతో పొత్తుకు వెంపర్లాడుతున్నాడు. జగన్ పై అటాక్ షురూ చేస్తున్నాడు.