Homeఆంధ్రప్రదేశ్‌JanaSena Social Media: దూసుకుపోతున్న జనసేన సోషల్ మీడియా - వైసీపీ ఇంకా ...

JanaSena Social Media: దూసుకుపోతున్న జనసేన సోషల్ మీడియా – వైసీపీ ఇంకా డైరెక్ట్ అటాక్!

JanaSena Social Media: ఏపీలో జనసేనకు మీడియా సపోర్టు అంతంతమాత్రమే. టీడీపీతో అనుకూల వాతావరణం ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా సంస్థలు పవన్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నాయి. మిగతా సమయాల్లో మాత్రం ఏదో మూలన వార్తలతో సరిపెడుతున్నాయి. ఇక వైసీపీ అనుకూల మీడియా అయితే అసలు జనసేన ఒక పార్టీయేనన్న చులకన భావనతో అసలు కవరేజే ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన నూతన పంథా ఎంచుకుంది. అదే సోషల్ మీడియా వింగ్. అయితే జనసేనకు ప్రత్యేక సోషల్ మీడియాతో పనిలేదు. ఎందుకంటే జనసైనికులే ఆ పార్టీ కొండంత అండ. ఏ పార్టీకి లేనంతగా హార్ట్ కోర్ ఫ్యాన్స్ జనసేనకు ఉన్నారు. వారే సోషల్ మీడియా బాధ్యతలను కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టింగ్ లు, కామెంట్లు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. విశాఖ గర్జనకు ముందు ఎందుకీ గర్జనల పేరిట పవన్ గర్జిస్తూ చేసిన కామెంట్స్ తొలుత సోషల్ మీడియా ఒక హైప్ క్రియేట్ చేశారు. ఏపీ పాలిటిక్స్ లో పెను దుమారమే రేపాయి. తరువాత విశాఖ ఎపిసోడ్ లో యుద్ధ వాతావరణమే సృష్టించాయి.

JanaSena Social Media
JanaSena Social Media

ఈ నెల 15న విశాఖ గర్జన పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. దాదాపు పాతిక ట్విట్లతో అధికార వైసీపీపై విరుచుకుపడ్డారు. ఎందుకీ గర్జనలు పేరిట కడిగి పారేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి మాట తప్పిన అంశాల వరకూ ప్రస్తావించి ఉతికి ఆరేశారు. కానీ దీనికి వైసీపీ నుంచి సరైన రిప్లయ్ రాలేదు. షరా మామ్మూలుగా వ్యక్తిగత దాడితోనే వైసీపీ నేతలు సరిపెట్టుకున్నారు. గతంలో ఇంతలా ఎప్పుడు పవన్ రియాక్టు కాలేదు. కానీ ప్రజల్లో ప్రాంతీయ వాదాన్ని రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించడాన్నిపవన్ సహించలేకపోయారు. అందులో భాగంగా వరసు ట్విట్లు సంధించారు.

ఇప్పుడు తాజాగా మరోసారి ట్విట్టర్ లో నేరుగా మంత్రులపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. మీకు కేటాయించిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా ఉందా? లేకుంటే చౌకబారు విమర్శలు చేసి పదవీ కాలం వెళ్లదీస్తారా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు కురిపించారు. తొలుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో మొదలు పెట్టారు. ఏపీలో అప్పుల చిట్టా ఎంతో చెబుతారా? ఒక్కో పౌరుడిపై ఎంత భారం మోపారో? వివరణ ఇవ్వగలరా బుగ్గనా? అంటూ ప్రశ్నించారు. కొండలు, చెరువుల్లోకాకుండా నివాసయోగ్యమైన భూముల్లో నాణ్యమైన ఇళ్లు ఎన్ని కట్టించారో చూపించగలవా జోగి? అని జోగి రమేష్ ను ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో సామాన్య ప్రజలకు ‘అర్ధమయ్యే భాష’లో చెప్పగలవా బొత్స? అని బొత్స సత్యనారాయణకు ప్రశ్నించారు. నీ రికార్డింగ్ డ్యాన్స్ లు అయిపోయాక ఖాళీ సమయాల్లో నువ్వు కష్టపడి తీసుకొచ్చిన పరిశ్రమల గురించి శ్వేతపత్రం విడుదల చేయగలవా గుడివాడ? అని మంత్రి అమర్నాథ్ ను ప్రశ్నించారు. పర్యాటకరంగ అభివృద్ధి కోసం నువ్వు చేసిన బృహత్ కార్యలేమిటోచెప్పగలవా మహానటి రోజా? అని ప్రశ్నించారు. ఇంకెంతమందిని మీ గుంతల రహదారులు బలితీసుకుంటే మొద్దు నిద్ర వీడుతావో తెలపగలవా దాడిశెట్టి? అని ప్రశ్నించారు. మీ సహచర మంత్రులు అనారోగ్యానికి గురైతే పక్క రాష్ట్రాల్లోకి పారిపోకుండా ఏపీలోనే స్థాయి వైద్య సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారు పబ్లిసిటీ క్వీన్ విడదల రజనీ? అంటూ పవన్ సెటైరికల్ గా సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజాలకు చెప్పు చూపిస్తూ పవన్ హెచ్చరికలు జారీచేయడం చర్చనీయాంశమైంది.

JanaSena Social Media
JanaSena Social Media

అయితే జనసేన సోషల్ మీడియా ఒక్క అటాక్ కే పరిమితం కాలేదు. వైసీపీ ఆడే రాజకీయ క్రీనీడలను గుర్తించి ముందుగానే సోషల్ మీడియా ద్వారా అలెర్ట్ చేస్తున్నారు. ఈ మధ్యన వైసీపీ మీడియాకు ఒక లీకు ఇచ్చింది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై జనసేన శ్రేణులు అటాక్ చేస్తాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న మాదిరిగా ఒక బులెటిన్ ను బయటకు వదిలింది. అయితే దీనిపై సోషల్ మీడియా వేదిక చేసుకొని జనసేన అగ్రనేతలు నాగబాబు, నాదేండ్ల మనోహర్ శ్రేణులను అలెర్ట్ చేశారు. కోడికత్తి తరహాలో వైసీపీ ప్లాన్ చేస్తోందని.. దానిని తిప్పికోట్టాలని పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ పన్నాగం ఆదిలోనే బూమరంగ్ అయ్యింది. అయితే ఇటీవల జనసేన సోషల్ మీడియా జెడ్ స్పీడ్ లో యాక్టవ్ గా ఉండడం ఆ పార్టీకి అనుకూల అంశంగా మారిందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper