Homeఆంధ్రప్రదేశ్‌Janasena Chief Pawan Kalyan: ఫైరింగ్ మొదలు పెట్టనున్న పవన్ కళ్యాణ్.. నాదేండ్లది అదే దారి?

Janasena Chief Pawan Kalyan: ఫైరింగ్ మొదలు పెట్టనున్న పవన్ కళ్యాణ్.. నాదేండ్లది అదే దారి?

Janasena Chief Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని 20 నెలలు కూడా లేవు. మరోవైపు ముందస్తు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పక్షాలు దూకుడు పెంచాయి. ప్రజల వద్దకు వెళుతున్నాయి. వారి అభిమానాన్ని చూరగొంటున్నాయి. అదే సమయంలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాయి. అధికార పక్షం సంక్షేమ తారకమంత్రాన్ని జపిస్తుండగా.. పాలనా వైఫల్యాలపై విపక్షలు గళమెత్తుతున్నాయి. అయితే మిగతా రాజకీయ పక్షాల కంటే జనసేన మంచి దూకుడును ప్రదర్శిస్తోంది. ఓ వైపు పవన్ కౌలురైతు భరోసా యాత్ర చేపట్టి పార్టీకి మంచి మైలేజ్ తీసుకురాగలిగారు. ప్రజావాణి, గుడ్ మార్నింగ్ సీఎం పేరిట వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజాభిమానాన్ని చూరగొంటుంది. అయితే ఇంత చేస్తున్నా పార్టీలో చేరికలు ఆశించినంతగా లేవు. అటు బడా నేతలు ఎవరూ పార్టీలో చేరడం లేదు. అయితే ఇది పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. కీలక నాయకులు, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేతలు పార్టీలో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నా ఎందుకనో వారికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనిపై జనసేన వర్గాల్లో కూడా ఓకింత అనుమానాలు ఉన్నాయి. అయితే దీనికి అనేక కారణాలున్నాయని జనసేన కీలక వర్గాలు చెబుతున్నాయి. పార్టీపై ప్రజాభిమానం ఉన్నా వ్యూహంలో మాత్రం అధిష్టానం ఆశించినంతగా పరిణితి చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. కింది స్థాయి వర్గాల్లో సైతం అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. దీనిని సరిదిద్దాలని వారు కోరుతున్నారు.

Janasena Chief Pawan Kalyan
Janasena Chief Pawan Kalyan

కాస్తా తగ్గిన మనోహర్ ప్రయారిటీ
ప్రస్తుతం జనసేనలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు నాదేండ్ల మనోహర్ కీలక నేతలుగా ఉన్నారు. మధ్యలో మెగా బ్రదర్ నాగబాబు యాక్టివ్ అయినా మళ్లీ ఆయన కనిపించకుండా పోయారు. దీంతో ఆ ఇద్దరు నేతలే అన్నీ చక్కబెడుతున్నారు. పార్టీ విధానపరమైన అంశాల గురించి వారే మాట్లాడుతున్నారు. పవన్ తరువాత నాదేండ్ల మనోహర్ కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అటు పవన్ సినిమాల్లో బిజీగా ఉన్నా మనోహర్ అన్నీతానై చక్కబెడుతూ వచ్చారు. అయితే జనసేనలో నేతల చేరికను మనోహర్ అడ్డుకుంటున్నారన్న టాక్ అయితే పార్టీలో ఉంది. కీలక నేతలు వస్తే ప్రాధాన్యత తగ్గుతుందనో.. లేకుంటే ఎన్నికల సమీపంలో చేర్చుకుంటే పార్టీకి ఊపు వస్తుందని భావించారో తెలియదు కానీ.. నాదేండ్ల మనోహర్ బడా నేతల చేరికకు అడ్డంకిగా మారారన్న ప్రచారం అయితే పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతోంది. ఇతర పార్టీల నుంచి పెద్ద నాయకులు చేరకుండా నాదేండ్ల మనోహర్ అడ్డుకుంటున్నారని ఆయన బాహటంగానే విమర్శలు గుప్పించారు. చాలామంది నాయకులు ఆసక్తి చూపిస్తున్నా.. పవన్ కు వారి మధ్య మనోహర్ అడ్డంకిగా మారారని ఘాటు కామెంట్స్ చేశారు.

Also Read: Pawan Kalyan: ఏపీని కబళిస్తున్న విషవాయువులు.. ప్రశ్నించిన పవన్

సీరియస్ గా దృష్టి..
జనసేనను వీడిన నాయకుల్లో ఎక్కువ మంది నాదేండ్ల మనోహర్ ను కార్నర్ చేసి వెళ్లిపోయారు. ఆయన వల్లే తాము పార్టీకి దూరమవుతున్నామని కూడా వెల్లడించారు. అయితే పవన్ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా వస్తున్న కామెంట్స్ తో పవన్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అందుకే ఆయనకు కాస్తా ప్రయారిటీ తగ్గించారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఆయనకు కేవలం పవన్ పర్యటనలకే పరిమితం చేసినట్టు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం మనోహర్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు కేవలం పవన్ పర్యటనలు, టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసేందుకే పరిమితం చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఇక నుంచి పార్టీలోని అన్ని బాధ్యతలు పవన్ చూసుకుంటారని సమాచారం. చేరికలు భారీగా ఉంటాయని కూడా జన సైనికులు భావిస్తున్నారు.

జనసేన శ్రేణుల్లో ఆనందం
జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ విరామం తరువాత పవన్ మంచి నిర్ణయం తీసుకున్నారని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి. పవన్ కు పార్టీ శ్రేణులకు చాలా గ్యాప్ ఉంటుందన్న ప్రచారం ఉంది. ఏదీ చేసినా మధ్యలో నాదేండ్ల మనోహర్ ఉంటారన్న టాక్ నడిచింది. దీనిని చెక్ చెబుతూ పవన్ నేరుగా రంగంలోకి దిగడంపై జనసేన పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అధికార, విపక్షంలో చాలామంది అసంతృప్త నాయకులు ఉన్నారు. వారంతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ నుంచి సంకేతాలు వెలువడడమే తరువాయి వారంతా క్యూ కట్టే అవకాశం ఉంది. అక్టోబరు నుంచి పవన్ యాత్రకు సిద్ధపడుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో కీలక నాయకులు నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు భారీగా చేరే అవకాశముందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

Also Read:VRO’s Concern: వీఆర్వోల ఆందోళన పొలిటికల్‌ టర్న్‌.. 121 జీవోపై విపక్షాల నిరసన

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version