Homeజాతీయ వార్తలుJammu And Kashmir: జమ్మూ కశ్మీర్ లో మరో ముప్పు.. ఉగ్రవాదం కాదు మరేంటి? ప్రకృతి...

Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్ లో మరో ముప్పు.. ఉగ్రవాదం కాదు మరేంటి? ప్రకృతి పగ పట్టిందా?

Jammu And Kashmir: భూతల స్వర్గంగా పేరు గాంచిన జమ్మూ ఎంత అందంగా ఉంటుంది కదా. అయితే ఈ అందాల జమ్మూకశ్మీర్‌కు ఇప్పుడు కొత్త ముప్పు పొంచి ఉంది. ముప్పు అంటే తీవ్రవాదం అనుకుంటున్నారా కానీ కాదు. నీటి వనరులు ఎండిపోవడం. గత 50 ఏళ్లలో ఇక్కడ అతి తక్కువ వర్షపాతం నమోదైంది. 2024లో సాధారణం కంటే 29% తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితి 2025 ప్రారంభంలో కూడా కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్‌కు జీవనాధారంగా భావించే జీలం నది అత్యల్ప నీటి మట్టంలో ప్రవహిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో గత ఐదేళ్లుగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది.

కరువు కారణాలు-ప్రభావాలు
వర్షాభావ పరిస్థితుల వల్ల జీలం నది ఇతర నీటి మట్టాలు పడిపోయాయని వాతావరణ నిపుణులు డాక్టర్ ఫైజాన్ ఆరిఫ్ అన్నారు. ఈ పరిస్థితి వ్యవసాయం, మత్స్య సంపద, తాగునీటి లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అలాగే హిమానీనదాలు కూడా వేగంగా కరిగిపోతున్నాయన్నారు. ఇది భవిష్యత్తులో మరింత తీవ్రమైన ఇబ్బందులకు సంకేతంగా మారుతుంది.

వర్షాభావం, కరువు వల్ల పెరుగుతున్న ప్రభావాల దృష్ట్యా, వాతావరణ అనుకూలత, నీటి నిర్వహణ వ్యూహాలను అనుసరించడం అవసరం. కశ్మీర్ లోయలోని నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం కరువును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. 2024లో నీటి మట్టం తక్కువగా ఉండటం వల్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లపై ప్రభావం పడిందని చీఫ్ ఇంజనీర్ బ్రహ్మజ్యోతి శర్మ తెలిపారు. కరువును ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈసారి నదీజలాలు రైతులకు అందేలా డ్రై పంప్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

హిమానీనదాలు కరగడం సంక్షోభానికి మరో కారణం?
జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌లలో దాదాపు 18,000 హిమానీనదాలు ఉన్నాయి. ఇవి వేగంగా కరిగిపోతున్నాయి. కాశ్మీర్‌లోని అతిపెద్ద హిమానీనదం అయిన కోలాహోయ్ 1962 నుంచి దాని ద్రవ్యరాశిలో దాదాపు 23% కోల్పోయింది. హిమానీనదాలు కరగడం నీటి మట్టం క్షీణత, వాతావరణ మార్పుల తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తుంది.

సమిష్టి కృషి అవసరం
పెరుగుతున్న కరువు దృష్ట్యా, నీటి సంరక్షణ, నిర్వహణ కోసం ప్రభుత్వం, స్థానిక ప్రజలు కలిసి శ్రమిస్తే ఈ అందాల స్వర్గం కాస్త సమస్యల నుంచి బయటపడుతుంది. ఎందుకంటే వర్షం, హిమపాతంపై నియంత్రణ సాధ్యం కాదు. కానీ నీటి వనరుల సక్రమ వినియోగం, నిర్వహణ సంక్షోభాన్ని తగ్గించవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లో మారుతున్న వాతావరణం, నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నీటి వనరులు ఎండిపోవడం, హిమానీనదాలు కరిగిపోవడం పర్యావరణానికే కాకుండా స్థానిక ప్రజల జీవనోపాధికి పెను ముప్పుగా మారుతోంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version