Homeఆంధ్రప్రదేశ్‌అమరావతి రైతులపై ‘జగన్ మార్క్’ బెదిరింపు..!

అమరావతి రైతులపై ‘జగన్ మార్క్’ బెదిరింపు..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వికేంద్రీకరణ బిల్లును ఎంత ఆపాలని చూసిన సాధ్యం కాలేదు. సీఎం జగన్ పంతంతో శాసనమండలిని రద్దుచేసి మరీ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకున్న సంగతి తెల్సిందే. ఇటీవలే గవర్నర్ కూడా ఈ బిల్లుపై సంతకం చేయడంతో ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది.

Also Read: అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..?

ఈ మేరకు ప్రభుత్వం వీలైనంత తర్వాత రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం చర్యలను అమరావతి రైతులు, టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ మూడు రాజధానులను వ్యతిరేకించడంతో మిగతా ప్రాంతాల్లో టీడీపీ కనుమరుగయ్యేలా కన్పిస్తోంది. దీంతో టీడీపీ నేతలు మునుపటిలా ఈ విషయంలో మాట్లాడటం లేదు. కేవలం కోర్టుల్లో కేసులు వేస్తూ రాజధాని తరలిపోకుండా అడ్డుపడున్నారు.

ఈ విషయంలో టీడీపీ సైలంటవ్వడంతో అమరావతి రైతులే రాజధాని కోసం ముందుండి పోరాడుతున్నారు. దీంతో ప్రభుత్వం వారిని నయనోభయానో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం అమరావతి ప్రజలకు అండగా ఉంటామని చెబుతున్నా రైతులు పట్టువదలకపోవడంతో జగన్ సర్కార్ బెదిరింపు చర్యలకు దిగుతోంది.

ఆ ప్రాంతానికి చెందిన మంత్రి కొడాలి నాని ఇటీవల సీఎం జగన్ కు ఒక రాసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. పేదలకు చోటులేని ప్రాంతంలో ప్రజాప్రతినిధులు కూర్చుని శాసనాలు చెయ్యడం భావ్యం కాదని మంత్రి చెప్పుకొచ్చారు. అందుకే అమరావతిలో శాసనసభ కూడా వద్దని సూచించినట్లు మంత్రి జగన్ సూచినట్లు లేఖను విడుదల చేశారు.

Also Read: ఎంత ఘోరం:పాడైపోయిన బీర్లు ఏపీ ప్రజలు తాగారా?

అమరావతి రైతులు ఇలాగే పోరాటం చేస్తే మీకు శాసన రాజధాని కూడా ఉండదనే ఉద్దేశం వచ్చేలా ఈ లేఖ ఉందనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది. సీఎం జగన్ మొండితనం తెలిసిన అమరావతి రైతులు  రాజధాని ఉద్యమంపై వెనక్కి తగ్గి ప్రభుత్వానికి సహకరిస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version