Homeఆంధ్రప్రదేశ్‌Amaravathi: అమరావతిపై తొందరపడని జగన్ సర్కార్

Amaravathi: అమరావతిపై తొందరపడని జగన్ సర్కార్

AmaravathiAmaravathi: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మూడు రాజధానుల విషయం మూలకు పడినట్లు కనిపిస్తోంది. దానిపై ఎవరు పట్టించుకోవడం లేదు. కోర్టు కూడా వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి(Amaravathi) పిటిషన్ పై విచారణ నవంబర్ 15కు వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో పిటిషనర్లు వాయిదా కోరడంతో ప్రభుత్వ లాయర్లు హైకోర్టు ఇష్టమని చెప్పడంతో వాయిదాకు ఇరువర్గాలు ఒప్పుకున్నాయి. హైకోర్టు నవంబర్ 15కు వాయిదా వేసింది. వాదనలకు ఇరు వర్గాలు ఆసక్తి చూపకపోవడంతో మూడు రాజధానుల పిటిషన్ పై కోర్టులో పిటిషన్ వేసింది ప్రభుత్వమే. కానీ ప్రస్తుతం దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో మూడు రాజధానుల వ్యవహారం ముందుకు సాగేలా కనిపించడం లేదు.

మూడు రాజధానుల వ్యవహారంపై సీజే ఏకే గోస్వామి ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. కరోనా కారణంగానే అప్పట్లో ఆగస్టుకు వాయిదా వేసినా మళ్లీ నవంబర్ కు పొడిగించడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ. కోర్టు కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నా ఈ కేసులో వాయిదాలు కోరడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని తెలుస్తోంది. అమరావతి విచారణకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు పై ప్రభుత్వం నిర్దిష్టంగా వ్యవహరించడం లేదని సమాచారం.

పిటిషనర్లు, ప్రభుత్వం రాజధాని వ్యాజ్యాల విషయంలో వాయిదాలకు ఒప్పుకోవడంతో ఈ అంశం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసు మరింత కాలం పెండింగులో పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సైతం సీఎం జగన్(CM Jagan) తన ప్రసంగంలో మూడు రాజధానుల విషయం లేకుండా చూసుకున్నారు. దీంతో ఇప్పట్లో మూడు రాజధానుల వ్యవహారంపై పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలతోనే ఈ వ్యవహారం పెండింగులో పడిపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం మూడు రాజధానులపై ఇప్పట్లో పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని తెలుస్తోంది. దీంతో అటు పిటిషనర్లలో ఇటు ప్రభుత్వంలో ఎలాంటి చొరవ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాజధానుల విషయం ఇప్పట్లో పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి వాసుల ఆందోళనల నేపథ్యంలో దీనిపై తేల్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version