
‘ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు’ చంద్రబాబు ప్రభుత్వం 2015లోనే అమలు చేసింది. ప్రతి రేషన్ షాపులో ఈ-పోస్ యంత్రాలు పెట్టి దాని ద్వారానే రేషన్ ఇవ్వాలన్నది తాజాగా కేంద్రం ఆదేశం. ఈ-పోస్ యంత్రాల్లో లబ్ధిదారుడు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. అవి ఆధార్తో అనుసంధానమై ఉంటాయి. దీనివల్ల దేశంలో ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా రేషన్ తీసుకోవడం వీలవుతుంది. కరోనా కాలంలో వలస కార్మికుల కష్టాలు చూసి ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయడం కోసం కేంద్రం ఈ షరతు విధించింది. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొలిరోజు నుంచే అమలు చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ విషయంలో అగ్రస్థానంలో ఉండాలని అప్పటి సీఎం చంద్రబాబు తపించారు. ఈ నేపథ్యంలో 2015లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ తెచ్చుకొన్న ఏపీ తర్వాత వరుసగా దేశంలో మొదటి ర్యాంక్లో నిలబడింది. కేంద్రం తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లోనూ ఏపీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది.
అదనపు రుణాల కోసం ఇప్పుడు కొత్తగా వైసీపీ ప్రభుత్వం కేంద్రం విధించిన రెండు షరతులను పాటించాల్సి ఉంది. ఒకటి వ్యవసాయ పంపుసెట్లకు నగదు బదిలీ పథకం, పురపాలక సంఘాల్లో సంస్కరణలు. పురపాలికల్లో సంస్కరణలు చేయాలంటే అది ఇప్పట్లో కాని పని. అందుకు చాలానే కసరత్తు జరగాలి. నగదు బదిలీ పథకం తీసుకురావడం ఈజీ. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ దీనిపై దృష్టి సారించింది. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ స్కీం ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు బిగించి.. ట్రాన్స్కోలు వారికి బిల్లులు అందిస్తాయి. ఆ బిల్లులకు సంబంధించిన డబ్బును మాత్రం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నెలనెలా జమ చేస్తూ ఉంటుంది. అంటే.. ఈ స్కీం ద్వారా రైతులపై పెద్దగా భారం పడే పరిస్థితి లేదు.
Also Read : అగ్రిగోల్డ్ కేసు : కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
Comments are closed.