Homeఆంధ్రప్రదేశ్‌జగన్‌ ‘ఏకగ్రీవ’ నిర్ణయం : మంత్రులకు టార్గెట్‌

జగన్‌ ‘ఏకగ్రీవ’ నిర్ణయం : మంత్రులకు టార్గెట్‌

Jagan
రాష్ట్రంలో లోకల్‌ బాడీ ఎలక్షన్ల హడావుడి షురూ కాబోతోంది. పార్టీలతో సంబంధం లేని ఎన్నికలే అయినా.. ఇప్పటికే ఆయా పార్టీల్లో వేడి రాజుకుంది. ఈ శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం ఆరంభం కాబోతోంది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలపై కసరత్తు చేపట్టింది. మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగానే ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నజరానాలు ప్రకటించేసింది.

Also Read: ఏ అడ్డువచ్చినా దూకుడు వీడని జగన్

ఇక- తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ -జనసేన మాత్రం ఈ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తోన్నాయి. ఏకగ్రీవ విధానాన్ని బహిష్కరించాలంటూ కోరుతున్నాయి. ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఏకగ్రీవాలను నిరోధించడానికి తమ వంతు ప్రయత్నాలు ఆరంభించాయి. బీజేపీ–-జనసేన పార్టీల నేతలు ఈ విషయాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లనున్నాయి. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ.. ఏకగ్రీవాల కోసం కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాల మధ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ రేపుతోంది.

Also Read: అక్రిడిటేషన్ల కోసం ఎస్‌ఈసీని కలిస్తే ఏం ఫాయిదా

ప్రతిపక్షాల గోళ ఎలా ఉన్నా.. అధికార వైఎస్సార్సీపీ తన పని తాను చేసుకుంటూ పోతోంది. అత్యధిక పంచాయతీలను ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకోవడానికి వ్యూహాలను రూపొందించుకుంటోంది. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు టార్గెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో జిల్లాలో 80 నుంచి 90 శాతం మేర పంచాయతీలను గెలుచుకోవాలనే లక్ష్యాన్ని వారికి నిర్దేశించినట్లు సమాచారం. ఏకగ్రీవం సాధ్యం కాని పంచాయతీలపై ఎన్నికల ద్వారా గెలుపుబావుటాను ఎగురవేయాల్సిందేనని, దానికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకోవాలంటూ వారిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

అయితే.. పంచాయతీ ఎన్నికలు అంటే పార్టీలతో సంబంధం లేనివి. అయినప్పటికీ.. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థులే విజయం సాధించాలనే పట్టుదలను మంత్రులు చూపిస్తున్నారు. తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకోవడానికి వ్యూహాలను పన్నుతున్నారు. ఎమ్మెల్యేల సహకారంతో పార్టీ బలంగా, గెలిచే అవకాశం లేని పంచాయతీలపై ఫోకస్ పెట్టారు. ఇన్‌చార్జి మంత్రులు జిల్లాల్లోనే మకాం వేయనున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించేలా షెడ్యూల్‌ను రూపొందించుకుంటున్నారు. జగన్‌ రూపొందిస్తున్న సంక్షేమ పథకాలే ఏకగ్రీవాలకు దారి చూపుతాయనే భరోసాలో వైసీపీ లీడర్లు ఉన్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version