దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం రాయపాటి కంపెనీదే.? రూ .7926 కోట్ల మోసం

కెనరా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియంలో 7926.01 కోట్ల రూపాయల బ్యాంకు మోసం జరిగినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు ఫిర్యాదు అందింది. హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ (ఇండియా) లిమిటెడ్, దాని ప్రమోటర్ , మాజీ టిడిపి ఎంపి రాయపతి సాంబశివరావుపై కెనరా బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ తాజాగా కేసు నమోదు చేసినట్టు సమాచారం. Also Read: రిఫరెండమా? చంద్రబాబు గాలితీసిన వంశీ దేశంలోనే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త నీరవ్ మోడీ […]

Written By: NARESH, Updated On : December 20, 2020 7:13 pm
Follow us on

కెనరా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియంలో 7926.01 కోట్ల రూపాయల బ్యాంకు మోసం జరిగినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు ఫిర్యాదు అందింది. హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ (ఇండియా) లిమిటెడ్, దాని ప్రమోటర్ , మాజీ టిడిపి ఎంపి రాయపతి సాంబశివరావుపై కెనరా బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ తాజాగా కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Also Read: రిఫరెండమా? చంద్రబాబు గాలితీసిన వంశీ

దేశంలోనే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త నీరవ్ మోడీ దుర్వినియోగం చేసిన మొత్తం కంటే రాయపాటి కంపెనీ ఎగ్గొట్టిన మొత్తం ఎక్కువ కావడం ఇక్కడ విశేషం. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం ఇదేనని సిబిఐ అధికారులు తెలిపారు.

ట్రాన్స్‌స్ట్రాయ్ (ఇండియా) లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోని మెగా ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టుతో సహా ప్రధాన నీటిపారుదల మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేస్తోంది.

సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో కంపెనీ, సిఎండి చెరుకూరి శ్రీధర్.. అదనపు డైరెక్టర్లు రాయపాటి సాంబశివరావు మరియు అక్కినేని సతీష్ నిందితులుగా పేర్కొంది. మాజీ ఎంపీ సాంబశివరావుపై మోసంకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. రెండోది సుమారు రూ .313.79 కోట్లు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రైవేటు సంస్థ బహుళ బ్యాంకింగ్ ఏర్పాట్లపై రుణాన్ని తీసుకొని ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్నాయి.

Also Read: చంద్రబాబు, జగన్.. ఓ అధికారి బలి!

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు శుక్రవారం దాడులు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం.ఈ సోదాల్లో ఐదుగురు సీబీఐ అధికారులు, నలుగురు కెనరా బ్యాంకు అధికారులు పాల్గొన్నట్టు తెలిసింది.

పోలవరం సహా పలు ప్రాజెక్టులు చేపట్టిన రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణాల కోసం పలు బ్యాంకులను సంప్రదించింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీనికి కెనరా బ్యాంకు నేతృత్వం వహించింది. అనంతరం ఈ బ్యాంకు నిధులను తప్పుడు మార్గం మళ్లించారని.. ఫలితంగా తమకు రూ.7926.01 కోట్లు నష్టం వాటిల్లినట్లు కెనరా బ్యాంకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు మేరకు రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ రూ.7926.01 కోట్లు మోసానికి పాల్పడిందని సీబీఐ తాజాగా అభియోగాలు నమోదు చేసింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్