Indian Currency Notes
Indian Currency Notes : మనం మన చేతులతో కరెన్సీ నోట్లు(Currency Notes) లెక్కించినప్పుడల్లా ప్రతి నోటుపై మహాత్మా గాంధీ(Mahatma gandhi)ని చూస్తాము. భారత కరెన్సీపై జాతిపిత మహాత్మా గాంధీ ఫోటో ఉండటం సాధారణ విషయంగా అనిపిస్తుంది. కానీ భారత కరెన్సీపై మహాత్మా గాంధీ ఫోటో ఎలా వచ్చింది? మహాత్మా గాంధీ కంటే ముందు భారత కరెన్సీ నోట్లపై ఎవరి బొమ్మ ఉండేది? భారత కరెన్సీ విషయంలో మహాత్మా గాంధీ కాకుండా రిజర్వ్ బ్యాంక్(Reserve bank) వద్ద ఎలాంటి ఆఫ్షన్లు ఉండేవి.. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
భారత కరెన్సీ నోట్ల నుండి మహాత్మా గాంధీ చిత్రాలను తొలగించాలని చాలా మంది వాదనలు వినిపించాయి. కొంతమంది బాపు స్థానంలో సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ఉంచాలని, మరికొందరు భగత్ సింగ్ చిత్రాన్ని ఉంచాలని సూచించారు.. రిజర్వ్ బ్యాంక్ అలాంటి వాదనలను పట్టించుకోవడం లేదు. మహాత్మాగాంధీ బొమ్మను అలాగే కొనసాగిస్తుంది. ఇప్పుడు నేరుగా టాపిక్లోకి వద్దాం.
గాంధీ కాకపోతే మరెవరు?
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ ఇండియాలో భారత కరెన్సీపై బ్రిటిష్(British) రాజుల చిత్రాలు ఉండేవి. ఇవి కింగ్ జార్జ్ V ఫోటోలను కరెన్సీ నోట్ల పై ముద్రించేవారు.. 1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా దేశ రాజ్యాంగం రూపొందించబడే వరకు ఈ నోట్లను ముద్రించడం కొనసాగింది. అయితే, స్వాతంత్ర్యం తర్వాత అందరూ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం భారత కరెన్సీ నోట్లపై ఉండాలని నమ్మారు. కానీ ఏకాభిప్రాయం అశోక స్తంభంపై ఉంది. 1950లో తొలిసారిగా 2, 3, 10, 100 రూపాయల నోట్లను ముద్రించారు. ఈ నోట్లపై అశోక స్తంభం(ashoka stambh) చిత్రం కూడా ముద్రించబడింది.
గాంధీ కంటే ముందు ఇవి కరెన్సీ నోట్లపై కూడా కనిపించాయి
స్వాతంత్ర్యం తర్వాత భారత కరెన్సీలో ప్రయోగాలు కొనసాగాయి. 1950 – 60 మధ్య పులి, జింక వంటి జంతువుల చిత్రాలు కూడా నోట్లపై ముద్రించబడ్డాయి. దీనితో పాటు మారుతున్న భారతదేశం అంటే హిరాకుడ్ ఆనకట్ట, ఆర్యభట్ట ఉపగ్రహం, బృహదేశ్వర ఆలయం చిత్రాలను కూడా నోట్లపై చూపించారు. కరెన్సీ నోట్లపై ముద్రణ కోసం ఆర్బిఐకి వచ్చిన ఫోటోల జాబితాలో గాంధీతో పాటు, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, లక్ష్మీ దేవత, గణేశుడు వంటి దేవతలు కూడా ఉన్నారు.
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఎప్పుడు కనిపించారు?
1969లో మహాత్మా గాంధీ 100వ జయంతి సందర్భంగా తొలిసారిగా ఆయన ఫోటోలను భారత కరెన్సీపై ముద్రించారు. ఇందులో మహాత్మా గాంధీ కూర్చుని ఉన్నట్లు చూపించారు. ఆయన వెనుక సేవాగ్రామ్ ఆశ్రమం చిత్రాలు ఉన్నాయి. 1987 నుండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ మహాత్మా గాంధీ బొమ్మను భారత కరెన్సీపై క్రమం తప్పకుండా ముద్రించడం ప్రారంభించింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Indian currency notes before mahatma gandhi whose figure was on the indian currency notes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com