India oil crisis plan B strategy: పశ్చిమాసియా యుద్ధ కారణంగా ఇంధన సంక్షోబం ఏర్పడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతోపాటు భారత్ కూడా ఇబ్బంది పడుతోంది. ఎల్పీజీ, సీఎన్జీ, ఎల్ఎన్జీ ఇబ్బందలు తలెత్తాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు రవాణా ఆగిపోయింది. భారత్ దిగుమతి చేసుకునే చమురులో 40 శాతం ఈ సంధి గుండానే వస్తుంది. యుద్ధం ఇంకా పెరిగి జలసంధి పూర్తిగా మూసివేస్తే చమురు రవాణా పూర్తిగా నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్లాన్ బి సిద్ధం చేస్తోంది.
రష్యాతో చమురు ఒప్పందాలు
ఏప్రిల్ నెలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేస్తూ భారత్ కొత్త ఒప్పందాలు ఖరారు. అమెరికా మినహాయింపుతో (30 రోజులు) తక్కువ ధరలకు సరఫరా భద్రపరుస్తోంది, ఇది దేశ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. దేశంలో 33 లక్షల టన్నులు పైగా చమురు, మార్కెటింగ్ కంపెనీలతో కలిపి 74 రోజుల అవసరానికి సరిపోయే స్టాక్ సిద్ధంగా ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: బెంగాల్ ఎన్నికల యుద్ధం.. పాలకులను నిర్ణయించేంది వారే!
ఎల్పీజీ ఉత్పత్తి పెంపు
33 కోట్ల కుటుంబాలకు వంటగ్యాస్ అందేలా దేశీయ ఉత్పత్తి 25 శాతం పెంచారు. హోటళ్లు మూతలు, అధిక కొనుగోళ్లకు ప్రజలు ఆందోళన చెందకుండా పర్యవేక్షణ పెంచారు. చమురు దిగుమతి చేసుకునే దేశాల సంఖ్యను కూడా 27 నుంచి 41 దేశాలకు విస్తరించింది. సౌదీ, యూఏఈ పైప్లైన్లు, అమెరికా మార్గాలు ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తున్నాయి. పీఎన్జీ విస్తరణకు ఆదేశాలు జారీ చేసింది.
ప్లాన్ బీ వల్ల ఇంధన ధరలు అదుపులో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం కాపాడుకుంటుంది. రష్యా ఆధారం పెరగడం అమెరికా సంబంధాలకు సవాల్. కానీ, దౌత్య నైపుణ్యంతో భారత్ భద్రత పటిష్టం అవుతోంది. భవిష్యత్తులో వైవిధ్యీకరణ దీర్ఘకాల రక్షణగా మారుతుంది.