Homeజాతీయ వార్తలుCM KCR: కేసీఆర్‌ గెలిస్తే.. కార్పొరేట్‌ రాజకీయాలకు చెక్‌!

CM KCR: కేసీఆర్‌ గెలిస్తే.. కార్పొరేట్‌ రాజకీయాలకు చెక్‌!

CM KCR: ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలుగా మారుతున్నట్లుగానే ప్రస్తుతం రాజకీయాలు కూడా కార్పొరేటీకరణ అయ్యాయి. రాజకీయా పార్టీలు అలా మార్చేస్తున్నాయి. గెలుపుపై ధీమా లేకపోవడం, ఓటర్లను మేనేజ్‌ చేయడంలో విఫలం అవుతుండడంతో విధిలేని పరిస్థితిలో ప్రశాంత్‌కిశోర్, సునీల్‌ కనుగోలు లాంటి కార్పొరేట్‌ వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకుండా.. కార్పొరేట్‌ సంస్థలపై ఆధారపడుతున్నారు.

రాజకీయాల్లో మర్పే కారణం..
రాజకీయాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. పాత తరం నేతలు క్రమంగా కనుమరుగవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆర్థిక, అంగ బలం ఉన్నవారే రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి నేతలకు ప్రజల సమస్యలు, ఆశలు, ఆకాంక్షలపై అవగాహన ఉండడం లేదు. దీంతో కార్పొరేట్‌ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టిఫీషియన్‌ వ్యూహాలు రూపొందించుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. దీంతో కార్పొరేట్‌ సంస్థలు కూడా వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సర్వేలు, పోల్‌ మేనేజ్‌మెంట్, బలాలు, బలహీనతల సర్వే పేరుతో పార్టీల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.

ప్రస్తుతం కూడా వ్యూహకర్తలే..
ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కు సునీల్‌ కనుగోలు, ఏపీలో వైసీపీకి ప్రశాంత్‌కిశోర్‌ పనిచేస్తున్నారు. సునీల్‌ ప్రశాంత్‌ కిశోర్‌ శిష్యుడే. టీడీపీకి ప్రశాంత్‌కిశోర్‌ మిత్రుడు రాబిన్‌శర్మ పనిచేస్తున్నారు. వీరంతా చేసేంది ఏమిటంటే తాత్కాలిక వ్యూహాలే. ఎన్నికల్లో పార్టీని గెలిపించడం వరకు నేతలను నటించేలా డైరెక్షన్‌ చేస్తున్నారు. చేతులు, కాళ్లు విరగొట్టుకోవడం, సానుభూతి ఓట్లు పొందేలా చేయడం, సెంటిమెంటు రగిలచ్చడం తదితర వ్యూహాలతో పార్టీలకు మైలేజ్‌ తెస్తున్నారు.

ఒంటరిగా కేసీఆర్‌..
ఇక ప్రస్తుతం కేసీఆర్‌ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగారు. వ్యూహాల్లో నిష్ణాతుడైన కేసీఆర్‌ తన సొంత ఆలోచనలతోనే బీఆర్‌ఎస్‌ను నడిపిస్తున్నారు. ఏడాది క్రితం ప్రశాంత్‌ కిశోర్‌తో పనిచేసినా.. తర్వాత తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ అన్నీ తానై పార్టీని ఎన్నికల్లో నడిపిస్తున్నారు. ఆయనకు కేటీఆర్, హరీశ్‌రావు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ ఎన్నికల తర్వాత కార్పొరేట్‌ సంస్థలకు చెక్‌ పడడం ఖాయం అంటున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలు, వ్యూహాలతో పనిచేసే నేతలే గెలుస్తారని తేలిపోతుంది. తాత్కాలిక వ్యూహాలు పనిచేయవని నిర్ధారణ అవుతుంది. దీంతో కార్పొరేట్‌ రాజకీయాలకు చెక్‌ పడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version