హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం, రూ. 5కోట్ల విలువైన మందులను అందించేందుకు ముందుకొచ్చింది. వాల్యూ ల్యాబ్స్ రూ.5.25 కోట్ల విరాళం, సువెన్ ఫార్మా కోటి రూపాయలు, ఎన్.సి.సి. లిమిటెడ్ కోటి రూపాయలు, శ్రీచైతన్య విద్యాసంస్థలు కోటి రూపాయలు, తెలంగాణ మోటార్ వెహికిల్స్ ఇన్స్ పెక్టర్ అసోసియేషన్ తరపున రూ.1.5 కోట్ల విరాళాలను ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన చెక్కులను ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలువురు విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. వీరిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అదేవిధంగా పెద్దమొత్తంలో సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న దాతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.