
అయోధ్యలో రామమందిరం నిర్మించాలని బీజేపీ ఎన్నో ఏండ్ల కల. ఇందుకోసం పోరాడుతూనే ఉంది. దీనిపై దశాబ్దాలుగా వివాదం నడుస్తూనే ఉంది. గతేడాది అత్యున్నత న్యాయ స్థానం ఆ భూమి రామయ్యదేనంటూ తీర్పునిచ్చింది. దీంతో అప్పటి నుంచి అయోధ్య రామమందిరం నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్రంలోని బీజేపీ. అంతేకాదు.. ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలని దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ ప్రారంభించింది.
Also Read: వాహ్.. ఏం స్కెచ్ : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మర్డర్లు
అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసి.. ప్రజల నుంచి విరాళాలు సేకరించడం ప్రారంభించిన నెలన్నర రోజుల్లో రూ.2100 కోట్లు జమ అయ్యాయి. దేశవ్యాప్తంగా హిందూ సంస్థల కార్యకర్తలు, బీజేపీ నేతలు యాక్టివ్గా విరాళాల సేకరణ చేపట్టడంతో ఈ ఫీట్ సాధ్యమైంది. అయోధ్యరామ మందిరం నిర్మాణానికి రూ.2100 కోట్లు ఖర్చు కాదు. పూర్తిస్థాయిలో ఆలయాన్ని నిర్మించడానికి రూ.1100 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఎంత అంచనాలు పెరిగినా మరో రూ.వంద కోట్లు పెరుగుతుందేమో కానీ వేల కోట్లు పెరిగే అవకాశం లేదు. ఈ ప్రకారం చూస్తే అయోధ్య రాముడికి రెట్టింపు నిధులు ప్రజలు సమకూర్చారని చెప్పుకోవచ్చు.
భారతీయ జనతా పార్టీ నేతలు ఆ పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు ఇతర బడా పారిశ్రామికవేత్తలు అయోధ్య రామ మందిరం కోసం ఉడతా భక్తీ.. రూ.కోట్లు విరాళాలు ఇచ్చారు. ఇస్తూనే ఉన్నారు. అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున భక్తితో.. ఎంత పేదవారయినా రూ.వెయ్యి పైనే చదివించుకున్నారు. ఓ ఉద్యమంలా.. ఆరెస్సెస్తోపాటు బీజేపీ నేతలు విరాళాలు సేకరించడంతో గ్రాండ్ సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. బలవంతంగా సేకరిస్తున్నారని.. ప్రజల్ని భయపెడుతున్నారని.. విరాళాలు ఇవ్వని వారి ఇళ్లను మార్క్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
Also Read: ఎమ్మెల్సీ రంగంలోకి కేసీఆర్ : వినూత్న ప్రచారం
అయితే.. అయోధ్యరామ మందరానికి ట్రస్ట్ ప్రత్యేకంగా చందా పుస్తకాలు పంపిణీ చేసింది. కొంత మంది మోసగాళ్లు ఈ అంశాన్ని కూడా తమ సంపాదనకు వాడుకున్నారు. నకిలీ పుస్తకాలు ముద్రించి చందాలు వసూలు చేశారు. లేకపోతే మరో నాలుగు, ఐదు వందల కోట్లు అయినా ఎక్కువగా వసూలయ్యేవని చెబుతున్నారు. నిజానికి రామ మందిరం నిర్మాణానికి చందాలు వసూలు చేయాల్సిన పని లేదు. తామే ఆలయాన్ని కట్టిస్తామని కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. కానీ.. ప్రజలు, భక్తులకు భాగస్వామ్యం కల్పించడానికి చందాలు వసూలు చేస్తున్నట్లుగా రామజన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. అందులో భాగంగా వసూళ్లు చేసింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజల స్పందన లభించింది. అందుకే.. ఇంత భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్