Homeజాతీయ వార్తలుHaryana CM Candidates: హర్యానా సీఎం అభ్యర్థులు.. కాంగ్రెస్‌ నుంచి హుడా.. బీజేపీ నుంచి సైనీ.....

Haryana CM Candidates: హర్యానా సీఎం అభ్యర్థులు.. కాంగ్రెస్‌ నుంచి హుడా.. బీజేపీ నుంచి సైనీ.. రేసులో ఎవరు ముందు?

Haryana CM Candidates: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌ తరఫున భూపిందర్‌సింగ్‌ హుడా రేసులో ఉండగా, బీజేపీ తరఫున సిట్టింగ్‌ సీఎం నయాబ్‌సింగ్‌ సైనీ అభ్యర్థిగా ఉన్నారు. పదేళ్ల తర్వాత హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ సాధించాలనే ఆశతో అధికార బీజేపీ ఉంది. ఫలితాలు మాత్రం ఎవరి అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. బీజేపీపై పెద్దగా వ్యతిరేకత లేదని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ మొదటి రౌండ్‌లోనే ఆధిక్యత కనబర్చింది. బీజేపీ రెండో రౌండ్‌ నుంచి అనూహ్యంగా పుంజుకుంది.

గెలిస్తే కాంగ్రేస్‌ సీఎం పిక్‌
కాంగ్రెస్‌లో సీఎం పదవికి పోటీ నెలకొంది. ప్రతిపక్ష నేత భూపింద్రసింగ్‌ హుడా ముందు వరుసలో ఉండగా, దళిత నేత కుమారి సెల్జా, ఏఐసీసీ ప్రధాన కర్యదర్శి రణదీప్‌ కూడా పోటీలో ఉన్నారు. సింగ్‌ సూర్జేవాలా, హుడా కుమారుడు దీపేందర్‌ కూడా పోటీ పడుతున్నారు. పార్టీ విజయం సాధించిన సందర్భంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ చివరికి ముఖ్యమంత్రి ఎంపిక చేసినప్పటికీ, అభ్యర్థుల వాదనలు కూడా పార్టీ సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. మాజీ సీఎం హుడా రాష్ట్రంలోని 90 సీట్లలో తనకు నచ్చిన 72 మందికి పైగా అభ్యర్థులను పొంది టిక్కెట్ల కేటాయింపులో ప్రముఖ పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని కూడా హుడా ముందు నుంచి నడిపించారు. సెల్జా, సుర్జేవాలా ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా ఉన్నందున వారిని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌ నాయకత్వం అనుమతించలేదు . దీపేందర్‌ ప్రస్తుతం రోహ్‌క్‌ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ముగ్గురు ఎంపీలు సీఎం కుర్చీ కోసం తమ ప్రయత్నాలు చేస్తే పార్టీ కేంద్ర నాయకత్వం తీర్పుపై ఆధారపడి ఉంటుంది.

హ్యాట్రిక్‌పై బీజేపీ విశ్వాసపం..
ఇక ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా వచ్చినా.. ఆ పార్టీ నేతలు మాత్రం హ్యాట్రిక్‌పై నమ్మకంతో ఉన్నారు. ఓబీసీ అయిన ప్రస్తుత సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీతోపాటు రాష్ట్ర చీఫ్‌ మోహన్‌లాల్‌ బడోలీ సీఎం రేసులో ఉన్నారు. రైతు ఉద్యమం కారణంగా ఈసారి జాట్‌లు బీజేపీకి ఓటు వేయకపోవచ్చని భావిస్తున్నారు. పదేళ్ల పాలనపైనా వ్యతిరేక ఉంది. అగ్నివీర్, రెజ్లర్ల వివాదం కూడా ప్రభావం చూపుతాయని అంచనా వేశారు. కానీ, ఇవేవీ ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు. అనూహ్యంగా ఎవరి అంచనాలకు అందని ఫలితాలను బీజేపీ సాధించే దిషగా ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలిచింది. ప్రస్తుతొం 45 సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో సైనీ, మోహన్‌లాల్‌ బడోలీ సీఎం పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఖట్టర్‌ను సీఎం పదవి నుంచి బీజేపీ తప్పించింది. సైనీని సీఎం చేసింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి కలసి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఫలితాలపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular