‘ఆయన మాటలు పిల్లలు వింటే గాంధీని మర్చిపోతారు’

జాతిపిత మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేని పొగుడుతూ నాగబాబు చేసిన ట్వీట్ల పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగబాబు వ్యాఖ్యలతో బాధపడ్డామని.. ఆయన మాటలు పిల్లలు వింటే గాంధీని మర్చిపోయేలా ఉన్నారని వీహెచ్ అన్నారు. గాడ్సే అసలు దేశభక్తుడు ఎలా అయ్యాడని నాగబాబుపై మండిపడ్డారు. చిరంజీవి గాంధీ గురించి గొప్ప సినిమా తీశారని.. తమ్ముడు […]

Written By: Neelambaram, Updated On : May 20, 2020 3:54 pm
Follow us on

జాతిపిత మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేని పొగుడుతూ నాగబాబు చేసిన ట్వీట్ల పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగబాబు వ్యాఖ్యలతో బాధపడ్డామని.. ఆయన మాటలు పిల్లలు వింటే గాంధీని మర్చిపోయేలా ఉన్నారని వీహెచ్ అన్నారు. గాడ్సే అసలు దేశభక్తుడు ఎలా అయ్యాడని నాగబాబుపై మండిపడ్డారు. చిరంజీవి గాంధీ గురించి గొప్ప సినిమా తీశారని.. తమ్ముడు పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టుల గురించి సినిమా తీశారని చెప్పారు. కానీ నాగబాబు గాడ్సే గొప్పోడని పొగడుతున్నాడని విమర్శించారు వీహెచ్. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రులన్న ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలతో నాగబాబు చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు.