Homeజాతీయ వార్తలుTRS vs Governar: ఓవర్‌ టూ ఢిల్లీ : మళ్లీ హస్తిన పర్యటనకు గవర్నర్‌ తమిళిసై.....

TRS vs Governar: ఓవర్‌ టూ ఢిల్లీ : మళ్లీ హస్తిన పర్యటనకు గవర్నర్‌ తమిళిసై.. మోదీ, షాతో భేటీ?

TRS vs Governar: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌చార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మళ్లీ హస్తిన పర్యటనకు వెళ్లారు. రేపు ఆమె మోదీ, షాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ ఢిల్లీ కేంద్రంగా హాట్‌టాపిక్‌గా మారాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పది రోజుల క్రితం హస్తిన పర్యటనకు వెళ్లిన ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తనపై వ్యవహరిస్తున్న తీరు, ప్రోటోకాల్‌ వివాదంతో పాటు రాజకీయ పరిస్థితులపైనా నివేదిక సమర్పించారు.

-మరోమారు ప్రధాని, అమిత్‌షాతో..
తాజాగా మరోసారి ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌ తమిళిసై కేంద్ర సహాయమంత్రి జితేందర్‌సింగ్‌ కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ప్రధాని, కేంద్ర మంత్రులను మరోసారి కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్‌ భవన్, ప్రగతి భవన్‌ మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతో ఆమె ఏయే విషయాలు చర్చిస్తారనేది ఆసక్తిగా మారింది. గత పర్యటనలో మోదీ, షాలతో భేటీ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరిగా ఆమె వ్యాఖ్యలను ఖండించారు. కొందరైతే అసలు గవర్నర్‌ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

-భద్రాద్రిలోనూ ప్రొటోకాల్‌ ఉలలంఘన..
మొన్నటి హస్తిన పర్యటన తర్వాత గవర్నర్‌ భద్రాద్రి కొత్తగూడెం పర్యటనకు వెళ్లగా అక్కడా అధికారులు మొహం చాటేసి ప్రోటోకాల్‌ అతిక్రమించారు. అనంతరం భద్రాచలం శ్రీరామ పట్టాభిషేకానికి హాజరుకాగా అక్కడా అవమానమే ఎదురైంది. అయితే ఇవన్నీ పట్టించుకోని గవర్నర్‌ రెండ్రోజుల పాటు జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి రాజ్‌భవ¯Œ కు వచ్చేశారు.

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న తమిళిసై ఆ రాష్ట్రంలోనూ అలాంటి అనుభవమే ఎదురైంది. అయితే అక్కడ అధికార పక్షం కాకుండా.. విపక్షం ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది మాదిరిగానే పుదుచ్చేరిలోనూ తమిళ సంవత్సరాది ‘చిత్తిరూ నిలవు’ పండగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై పుదుచ్చేరిలో విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే గవర్నర్‌ విందుకు ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు గైర్హాజరయ్యాయి. ఇన్‌చార్జి లెప్టినెంట్‌ గవర్నర్‌గా రాజ్యాంగబద్ధమైన హోదాలో వున్న తమిళిసై తన పరిధి దాటి వ్యవహరిస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఈ విందును బహిష్కరించాయి. తాజాగా ఈ నేపథ్యంలోనే తమిళిసై ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. రెండు రాష్ట్రాల్లో తనకు ఎదురవుతున్న పరాభవాలను మళ్లీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా?.. లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper