Homeఆంధ్రప్రదేశ్‌జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

Gottipaati raviజగన్ దెబ్బకు టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు టీడీపీ నేతలు జైలుకు వెళ్లారు. దీంతో టీడీపీ బ్యాచ్ అంతా సైలెంట్ అయిపోయింది. కానీ ఒకే ఒక్కడు ఆ టీడీపీ ఎమ్మెల్యే మాత్రం జగన్ ఎన్ని ముప్పుతిప్పలు పెట్టినా ఎదురొడ్డి నిలుస్తున్నాడు. ఆర్థికంగా దెబ్బతీస్తున్నా తట్టుకుంటున్నారు. జగన్ కు ఎదురెళుతూ సత్తా చాటుతున్న ఆ టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!

ఏపీలో అన్ని జిల్లాల్లో వైసీపీ గాలి వీచినా ప్రకాశం జిల్లాలో మాత్రం ఆ గాలిని తట్టుకొని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో కొందరు వైసీపీ వైపు చూస్తున్నారు. కొందరు చేరడం లేదు. గత కొన్ని నెలలుగా  వైయస్ఆర్సిపి నాయకత్వం టీడీపీ ఎమ్మెల్యేలను, మాజీ నేతలను ఆకర్షిస్తోంది. పలువురిని చేరేలా ఒప్పిస్తోంది. వినని వారిని  సామధానభేద దండోపాయాలు ప్రయోగించి దారికి తెస్తోంది. ఎలాగైనా సరే ప్రకాశం జిల్లాలో టిడిపిని తుడిచిపెట్టే ప్రయత్నాలకు అన్ని ప్రయత్నాలను వైసీపీ అధిష్టానం చేస్తోందని టాక్.

ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనులను వైసీపీ సర్కార్ చేస్తోంది. ఇప్పటికే బెదిరించారు. వారి మైనింగ్ లీజులను కూడా రద్దు చేశారు. ఈ దాడి తరువాత, టిడిపి సీనియర్ శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణ మూర్తి, చీరాలకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దెబ్బకు వైసీపీలో చేరారు. దీంతో ప్రకాశం జిల్లాలో ఇది వైసీపీకి దక్కిన విజయంగా మారింది.

అయితే అందరూ అధికార పార్టీ వైపు చూస్తున్నా కూడా.. వైయస్ఆర్సి ఎంత ప్రయత్నించినా టిడిపి అద్దంకి ఎమ్మెల్యే  గొట్టిపాటి రవి కుమార్ మాత్రం మెట్టుదిగడం లేదు.. టిడిపిని విడిచిపెట్టమని అతనిపై ఒత్తిడి తీసుకురావడానికి అధికార పార్టీ అన్నింటినీ ప్రయోగించింది.. కానీ ఈ హామీలు ఏవీ కార్యరూపం దాల్చలేదు.దీంతో సీరియస్ అయిన  వైసీపీ ప్రభుత్వం గొట్టిపాటికి ప్రధాన ఆదాయ వనరు అయిన మైనింగ్ లీజులను కూడా రద్దు చేసింది. అతని గనులను కూడా స్వాధీనం చేసుకుంది. కానీ గొట్టిపాటి హైకోర్టుకు వెళ్లి తన లీజులను తిరిగి పొందాడు. కాబట్టి, ఇప్పుడు వైసీపీ ప్లాన్ బి అమలు చేస్తోంది. గొట్టిపాటి ప్రధాన అనుచరులను ఆయననుంచి దూరం చేసి ఆయన కాళ్ళ క్రింద నుండి బలమైన నేతలను లాగాలని అధికార పార్టీ నిర్ణయించింది.

Also Read : మందుబాబులకు మళ్లీ షాక్ ఇస్తోన్న జగన్ సర్కార్

తాజాగా గొట్టిపాటికి బలమైన అనుచరుడు అయిన చింతా రామారావు, జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు మరియు సంతమగళూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకుడిని ఆకర్షించి వైసీపీలో చేర్చుకున్నారు. ఇది గొట్టిపాటి రవి కుమార్ కు బలమైన దెబ్బగా అభివర్ణిస్తున్నారు.  ఇంతవరకు  అద్దంకి నియోజకవర్గంలో టిడిపికి బలంగా.. గొట్టిపాటి రైట్ హ్యాండ్ గా ఉన్న చింతా రామారావు తన మద్దతుదారులతో కలిసి మంత్రి బలినేని శ్రీనివాస రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాడు. దీంతో అక్కడ టీడీపీకి బలమైన దెబ్బ తగిలింది. గొట్టిపాటికి ఇది షాక్ లా మారింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై తాను అధికార పార్టీలో చేరినట్లు చింతా రామారావు తెలిపారు.

గొట్టిపాటికి ఇది ఒక షాక్. ఎందుకంటే అతను తన కేడర్‌ను మొదటి నుంచి కాపాడుకుంటున్నాడు. నిజానికి ఆయన మొదట కాంగ్రెస్ తో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత  వైసీపీలో చేరి సీటును గెలుచుకున్నాడు. కానీ తరువాత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు గురై టిడిపిలోకి గత ప్రభుత్వంలో ఫిరాయించాడు. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. మాతృపార్టీ అయిన వైసీపీలోకి ఎంత ఒత్తిడి తెచ్చినా చేరడం లేదు. గొట్టిపాటిని ఎంత దెబ్బతీస్తున్నా సరే పార్టీ మారేందుకు మాత్రం మొగ్గుచూపకపోవడం విశేషం.

-నరేశ్

Also Read : అమరావతి రైతులకు జగన్ సర్కార్ షాక్ ఇవ్వనుందా….?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version