ఏపీలో తొలి కరోనా మరణం

కరోనా వైరస్ ఏపీలో కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో తొలి కరోనా మరణం విజయవాడలో సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా ఆ వ్యక్తికి కరోనా సోకింది. వెంటనే తండ్రి, కుమారుడితో కాంటాక్ట్ అయిన 29 మందిని క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించడంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఆ వ్యక్తి నుంచి ఈ వైరస్ ఎంతమందికి సోకిందో […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 3:13 pm
Follow us on

కరోనా వైరస్ ఏపీలో కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో తొలి కరోనా మరణం విజయవాడలో సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.

మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా ఆ వ్యక్తికి కరోనా సోకింది. వెంటనే తండ్రి, కుమారుడితో కాంటాక్ట్ అయిన 29 మందిని క్వారంటైన్‌కు అధికారులు తరలించారు.

రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించడంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఆ వ్యక్తి నుంచి ఈ వైరస్ ఎంతమందికి సోకిందో అనే ఆందోళన జనాల్లో నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . శుక్రవారం నాటికి 161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.

ఏపీ నుంచి ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన వాళ్లలో 108 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తేల్చింది. మొత్తంగా ఏపీ నుంచి 1805 మంది నిజాముద్దీన్ కు వెళ్లినట్లు గుర్తించారు. అందులో 881 మందికి పరీక్షలు నిర్వహించగా.. 108 మందికి పాజిటివ్ గా తేలింది.

అంతేకాకుండా జమాతే వెళ్లిన వారికి చెందిన 605 కుటుంబ సభ్యులను పరీక్షించగా.. 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో మొత్తం 161 కేసులు నమోదుకాగా.. అందులో 140 కేసులు జమాతే వెళ్లి వచ్చిన వారేనని తేలింది.

నిన్నటి వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవ్వగా.. తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అత్యధికంగా నెల్లూరులో 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 23, గుంటూరు 20, కడప 19, ప్రకాశం జిల్లాలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి.