ఆ రైతుని ప్రత్యేకంగా అభినందించిన కేసీఆర్!

తెలంగాణలో తొలిసారి ఆపిల్ పండ్లు పండించిన రైతును సీఎం కేసీఆర్ అభినందించారు. కొమురం భీం జిల్లాకి చెందిన బాలాజి అనే రైతు తొలిసారి ఆపిల్ పండ్లు పండించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రికి మొక్కను, పండ్ల బుట్లను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో  2 ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగుచేసినట్లు బాలాజీ తెలిపారు. తొలి కాతను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ […]

Written By: Neelambaram, Updated On : June 2, 2020 1:09 pm
Follow us on

తెలంగాణలో తొలిసారి ఆపిల్ పండ్లు పండించిన రైతును సీఎం కేసీఆర్ అభినందించారు. కొమురం భీం జిల్లాకి చెందిన బాలాజి అనే రైతు తొలిసారి ఆపిల్ పండ్లు పండించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రికి మొక్కను, పండ్ల బుట్లను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో  2 ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగుచేసినట్లు బాలాజీ తెలిపారు. తొలి కాతను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగు పై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బాలాజీని అభినందించారు. తెలంగాణ నేలల విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండడమే ఉదాహరణ అన్నారు.