టపాసులు ప్రాణాలు ఇలా తీశాయి.. తండ్రీకొడుకులు మృతి.. షాకింగ్ వైరల్ వీడియో

మృత్యువు ఎంత పగబడుతుంది? ముక్కు పచ్చలారని ఇద్దరు తండ్రీకొడుకులను బలి తీసుకుంది. ఏడేళ్ల చిన్న కుమారుడి దీపావళి సంబురాన్నిరెట్టింపు చేద్దామని బయలు దేరిన ఆ తండ్రీ కొడుకుతో సహా మృత్యువు ఒడిలోకి జారుకున్నాడు. టపాసులే వారిద్దరి ప్రాణాలు తీయడం విషాదాన్ని నింపింది. తమిళనాడులోని విల్లుపురంలో కొడుకుకు టపాసులు కొని వాటిని తీసుకొని ఇంటికి వస్తుండగా వారిద్దరిని ఆ బాంబులే బలితీసుకున్నాయి. విల్లుపురం జిల్లా కొట్టకుప్పంలో బైక్ పై టపాసులు తీసుకెళుతున్న టపాసులు పేలి తండ్రీకొడుకులు చనిపోయారు. ఈ […]

Written By: NARESH, Updated On : November 5, 2021 7:38 pm
Follow us on

మృత్యువు ఎంత పగబడుతుంది? ముక్కు పచ్చలారని ఇద్దరు తండ్రీకొడుకులను బలి తీసుకుంది. ఏడేళ్ల చిన్న కుమారుడి దీపావళి సంబురాన్నిరెట్టింపు చేద్దామని బయలు దేరిన ఆ తండ్రీ కొడుకుతో సహా మృత్యువు ఒడిలోకి జారుకున్నాడు. టపాసులే వారిద్దరి ప్రాణాలు తీయడం విషాదాన్ని నింపింది.

తమిళనాడులోని విల్లుపురంలో కొడుకుకు టపాసులు కొని వాటిని తీసుకొని ఇంటికి వస్తుండగా వారిద్దరిని ఆ బాంబులే బలితీసుకున్నాయి. విల్లుపురం జిల్లా కొట్టకుప్పంలో బైక్ పై టపాసులు తీసుకెళుతున్న టపాసులు పేలి తండ్రీకొడుకులు చనిపోయారు.

ఈ ఘటనలో పక్కనే బైక్ పై వెళుతున్న ఆరుగురు సైతం తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి తండ్రీకొడుకుల శరీరాలు కూడా తునాతునకలయ్యాయి. ఈ దుర్ఘటనలో వారు ప్రయాణిస్తున్న బైక్ కూడా పూర్తిగా చిత్తుచిత్తు అయ్యింది. ఒక పెద్ద బాంబు పేలితే ఎలా విధ్వంసం జరుగుతుందో అలా జరిగింది.

ఇక నడిరోడ్డుపై జరిగిన పేలుడు ఘటనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. పేలుడు దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. పోలీసులు దీనిపై విచారణ కొనసాగుతోంది.