జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ సంచలన నిర్ణయం

రాష్ట్రంలోని కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలంతా ఇప్పుడు జీహెచ్‌ఎంసీ మీదనే దృష్టి సారించాయి. ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటున్నాయి. నవంబర్ మొదటి లేదా.. రెండో వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయాల […]

Written By: NARESH, Updated On : October 5, 2020 6:05 pm
Follow us on

రాష్ట్రంలోని కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలంతా ఇప్పుడు జీహెచ్‌ఎంసీ మీదనే దృష్టి సారించాయి. ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటున్నాయి. నవంబర్ మొదటి లేదా.. రెండో వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయాల పార్టీలు ఉన్నాయని.. అందులో 8 పార్టీలు తమ అభిప్రాయం తెలిపాయని ఈసీ ప్రకటించింది. బీజేపీ మాత్రమే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ఎన్నికకే అనుకూలంగా ఉంది.

కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు ఈవీఎంలతో నిర్వహిస్తే ఒక్క ఓటరుకు కరోనా ఉంటే అందరూ ఈవీఎంలు నొక్కితే అందరికీ వ్యాపిస్తుంది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం బ్యాలెట్ ఓటింగ్ కే నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే ఈ నిర్ణయాన్ని ఎస్ఈసీ తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో ఇప్పుడు రెండు ఎన్నికలు రాజకీయ పార్టీల్లో కాకపుట్టిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాయి. ఒకటి దుబ్బాక ఎన్నిక కాగా.. రెండోది జీహెచ్ఎంసీ ఎన్నికలు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో పార్టీల్లో వేడి రగులుకుంది.