Homeజాతీయ వార్తలుDuvvada Srinivas Political Strategy: అంతు పట్టని దువ్వాడ రాజకీయం!

Duvvada Srinivas Political Strategy: అంతు పట్టని దువ్వాడ రాజకీయం!

Duvvada Srinivas Political Strategy: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రజల మధ్యకు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం లో పర్యటనలు మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారు. లేకుంటే మాత్రం ఇండిపెండెంట్ గా బరిలో ఉంటారు. ఎలా చూసుకున్నా ఆయన పోటీ చేయడం అనివార్యం అని తెలుస్తోంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన కుటుంబ, వ్యక్తిగత వ్యవహార శైలితో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని భావించి హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తిరిగి వైసీపీలో చేరుతానని ఆశ భావంతో ఉన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ. అదే సమయంలో వైసీపీలోని జిల్లా నేతలతో ఆయనకు సఖ్యత లేదు. జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూనే జిల్లా నేతలపై ఆరోపణలు చేస్తున్నారు దువ్వాడ.

* టెక్కలిలో తరచూ పర్యటనలు..
దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి అసెంబ్లీ తరచూ పర్యటనలు చేస్తున్నారు. వివాహాలతో పాటు శుభకార్యాలకు హాజరవుతున్నారు. మృతుల కుటుంబాలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శిస్తున్నారు. ఇదంతా టెక్కలి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అని స్పష్టమవుతోంది. నిన్ననే ఆయన టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడారు. సదుపాయాలపై ఆరా తీశారు. జగన్మోహన్ రెడ్డి ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తే.. నిర్వహణలో టిడిపి కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి అచ్చెనాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడులపై విమర్శలు చేశారు. అయితే ఈ పర్యటనలో సైతం ఆయన వెంట దివ్య మాధురి ఉండడం విశేషం.

* నష్టం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే..
వచ్చే ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకోవాలన్నదే దువ్వాడ శ్రీనివాస్ టార్గెట్. అయితే ఇప్పటికే ఒకసారి ఎంపీగా,, రెండుసార్లు ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ నెగ్గలేకపోయారు దువ్వాడ. అయితే ఆయనలో ఉన్న దూకుడు మెచ్చి కానీ ఇప్పుడు జిల్లా నేతలను కాదని దువ్వాడకుపార్టీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. అలాగని దువ్వాడ టిడిపిని విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు. ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసి.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన ప్యానల్స్ పెట్టి పోటీ చేస్తే మూల్యం చెల్లించుకునేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అయితే దువ్వాడ సైతం తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ప్రధమ శత్రువుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే చూసే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular