దుబ్బాక ఫలితం.. గ్రేటర్‌‌పై ప్రభావం

దుబ్బాక ఉప పోరు ముగిసింది. ఇక గ్రేటర్‌‌ సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. మినీ అసెంబ్లీ తరహాలో పోటీపడే గ్రేటర్‌‌ ఎన్నికల హడావిడి మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నెల 13 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు గ్రేటర్ ఓటర్ల జాబితాకు ఓ రూపం ఇచ్చే ప్రక్రియను తెలంగాణ ఎస్‌ఈసీ ప్రారంభించింది. 13లోపు ఓటర్ల జాబితా సిద్ధం కానున్నట్లు ఎస్‌ఈసీ పార్థసారధి ప్రకటించారు. ప్రభుత్వంతో మాట్లాడాక షెడ్యూల్‌కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే […]

Written By: NARESH, Updated On : November 4, 2020 12:29 pm
Follow us on

దుబ్బాక ఉప పోరు ముగిసింది. ఇక గ్రేటర్‌‌ సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. మినీ అసెంబ్లీ తరహాలో పోటీపడే గ్రేటర్‌‌ ఎన్నికల హడావిడి మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నెల 13 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు గ్రేటర్ ఓటర్ల జాబితాకు ఓ రూపం ఇచ్చే ప్రక్రియను తెలంగాణ ఎస్‌ఈసీ ప్రారంభించింది. 13లోపు ఓటర్ల జాబితా సిద్ధం కానున్నట్లు ఎస్‌ఈసీ పార్థసారధి ప్రకటించారు.

ప్రభుత్వంతో మాట్లాడాక షెడ్యూల్‌కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియను నామినేషన్ల దగ్గర్నుంచి కౌంటింగ్ వరకూ.. వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నారు. అంటే.. రెండు వారాల వ్యవధిలోనే ఈ ప్రక్రయి అంతా పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. దుబ్బాక ఎన్నికల్లో వచ్చే ఫలితాలు గ్రేటర్‌‌ ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం చూపే అవకాశాలూ ఉన్నాయని తెలుస్తోంది.ఎప్పుడూ లేని విధంగా దుబ్బాకలో బీజేపీకి కాస్త పాజిటివ్ వేవ్ కనిపించింది. టీఆర్ఎస్ కూడా బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా భావించింది. ఇక గ్రేటర్‌లో బీజేపీ సహజంగానే కాస్త బలంగా ఉంది. గతంలో ఓ సందర్భంలో కేసీఆర్ కూడా.. గ్రేటర్‌లో బీజేపీ బలపడిందని.. గతంలో కంటే ఒకటి , రెండు సీట్లు ఎక్కువగా గెల్చుకుంటుందని చెప్పారు. ఇది ఆ పార్టీకి పాజిటివ్‌గా మారింది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. గ్రేటర్ పోరును ఎలాగూ చాలెంజ్‌గానే తీసుకుంటారు.

ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే తమ దృష్టి గ్రేటర్‌‌పై పెట్టామని ప్రకటించారు. టీఆర్ఎస్ తరపున గ్రేటర్ బాధ్యతలు తీసుకున్న కేటీఆర్.. అభివృద్ధి కార్యక్రమాలు డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంతో సుడిగాలిలా చుట్టేస్తున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు పూర్తి చేసి టీఆర్ఎస్ పట్టు తగ్గలేదని నిరూపించాలని కేటీఆర్ భావిస్తున్నారు. కానీ.. దుబ్బాకలో వ్యతిరేక ఫలితం వస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ గ్రేటర్‌పై తప్పకుండా పడుతుందనేది అందరికీ తెలిసిందే. సానుకూల ఫలితం వస్తే మాత్రం గ్రేటర్‌‌ ఎన్నికలకు అధికార పక్షం సై అంటుంది. ఆ తర్వాత నోటిఫికేషన్‌, షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.