
రాజకీయాల్లో ఒక నాయకుని జాతకం మరో నాయకుడు చెబుతుంటారు. అతనేదో రాజకీయ పండితుడు అన్నట్లుగా ఏదేదో చెప్పేస్తుంటారు. అది కొన్ని కొన్ని సందర్భాల్లో నిజం అవుతుంటుంది. మరికొన్ని సందర్భాల్లో దెబ్బతీస్తుంటుంది. అయితే.. రాజకీయాల్లో తలపండిన వారే ఎక్కువ మంది ఉంటారు. వారికి పురిట్లో సంధి కొట్టుకుపోయే పార్టీ ఏదో పది కాలాల పాటు నిలిచే పార్టీ ఏదో కూడా పక్కా క్లారిటీగా తెలుస్తుంది. ఇక ఒక పార్టీ అధికారంలోకి వచ్చే సీన్ ఉంటే కూడా ఆ లక్షణాలు వారికి బాగా కళ్లకు కనిపిస్తాయి.
Also Read: సర్వే: వైసీపీకే కార్పొరేషన్లు, టీడీపీ, బీజేపీ-జనసేన పరిస్థితిదీ
ఇక.. అలాంటి రాజకీయ జాతకాలు వేసే వారిలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఆయన టీడీపీ 2019 ఎన్నికల్లో ఓడిపోతుందని ముందే ఊహించారు. అయితే.. అన్నీ తెలిసి కూడా వేరే దారి లేక ఆ మునిగే పడవలో తాను కూడా ఉండి మునిగిపోయారు. గంటా శ్రీనివాసరావు తాజా తీరు చూస్తే చాలు ఏపీలో రాజకీయం మారుతోందని కచ్చితంగా చెప్పొచ్చు. ఆయన 20 నెలల వైసీపీ పాలనను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. జగన్ సంక్షేమం వరకూ ఓకే కానీ అభివృద్ధి అన్నది అసలు లేదు. మరోవైపు చూసుకుంటే జగన్ పాలనకు ఎన్నో అవరోధాలు అడ్డంకులూ కూడా ఎదురవుతున్నాయి. కనీసం చంద్రబాబు హయాంలో వచ్చినట్లుగా కేంద్ర సాయం కూడా రాష్ట్రానికి అందడంలేదు. ఇక జగన్ అప్పులు చేసి ఏపీని పోషిస్తున్నారు. ఆ అప్పులు కూడా ఇక పుట్టవు అని తెలుస్తోంది. దీంతో జగన్ సర్కార్కు ముందు మరిన్ని గడ్డు పరిస్థితులే రాబోతున్నాయని గంటా శ్రీనివాసరావు అంచనా వేస్తున్నారని తెలుస్తోంది.
గంటా శ్రీనివాసరావు ఇన్నాళ్లకు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా.. ఆయన ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అయిందని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఒక మాట అన్నారు. తాను టీడీపీని వీడిపోవడం లేదని. అంటే ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏదో ఆయనలో ఉండి ఉండాలి. అందుకే ఆయన జీవీఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి చూస్తున్నారు. మేయర్ పీఠం టీడీపీదే కావాలి అని కూడా గంటా శ్రీనివాసరావు గట్టిగా కోరుకుంటున్నారు.
Also Read: ఆంధ్రా బంద్: ‘విశాఖ ఉక్కు’ కోసం.. కదిలిన దండు..
ఇక.. మాజీ మంత్రి నోట చాన్నాళ్ల తరువాత చంద్రబాబుని వెనకేసుకుంటూ ఒక మాట వినిపించింది. ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా చేసే ఏ పోరుకైనా చంద్రబాబు సహకరిస్తారు అని గంటా శ్రీనివాసరావు బాబు పక్షాన సపోర్టుగా మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి కూడా ఉందని ఆయన అంటున్నారు. అయితే.. లీడ్ తీసుకోవాల్సింది మాత్రం జగన్ అని ఆయన ముఖ్యమంత్రిని కార్నర్ చేస్తున్నారు. జగన్ కనుక నాయకత్వం వహిస్తే పోరాటం ఎలాంటి సహకారం కావాలన్నా కూడా బాబు అందిస్తారు అని చెప్పడం తెలివిగా ఇపుడు వైసీపీ కోర్టులో బంతిని వేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్