spot_img
Homeజాతీయ వార్తలుDharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం...

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి బాధ్యత తీసుకుంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ రాజీనామా వెనుక కేవలం ఒక మంత్రి నిర్ణయం మాత్రమే కాదు. రాజకీయ ఒత్తిడి, గడువులు, చర్చలు, అంతర్గత సంకేతాలు ఉన్నాయి.

నెలల తరబడి ఒత్తిడి..
కొన్ని నెలలుగా కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) నేతృత్వంలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్‌ పేపర్‌ లీక్‌పై బాధ్యత వహించాలని మంత్రి రాజీనామా కోసం డిమాండ్‌ చేస్తూ జంతర్‌ మంతర్‌ వద్ద నిరంతరం నిరసనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇతర డిమాండ్లపై సుముఖంగా ఉన్నట్లు సూచనలు వచ్చినా, మంత్రి రాజీనామా విషయంలో మాత్రం మొదటి నుంచి గట్టి వైఖరి అవలంబించింది.

గడువు విధించిన సీజేపీ..
కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు జూలై 24న చర్చలు జరిపారు. రెండు అంశాలకు కేంద్రం సుముఖత తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సీజేపీ జూలై 25 వరకు గడువు విధించింది. శనివారం మరో దఫా చర్చలు జరగాల్సి ఉండగా, అకస్మాత్తుగా రాజీనామా వచ్చింది. చర్చలు కొనసాగుతున్న దశలోనే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.

మోదీ వద్దన్నా..
ప్రారంభంలో ప్రభుత్వ వర్గాల నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు అవకాశం లేదని స్పష్ట సంకేతాలు వచ్చాయి. రాజీనామా సులభమైన మార్గం అని, సమస్యను పరిష్కరించకుండా తప్పించుకోవడమే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా చివరకు ధర్మేంద్ర ప్రధాన్‌ స్వయంగా బాధ్యత తీసుకుని రాజీనామా చేశారు.

తెరవెనుక ఏం జరిగింది?
సీజేపీ డెడ్‌లైన్, నిరంతర ఆందోళనలు, విద్యార్థుల్లో పెరుగుతున్న అసంతృప్తి, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఒత్తిడి.. ఇవన్నీ కలిసి ప్రభుత్వాన్ని క్లిష్ట పరిస్థితిలో పడేశాయి. మరోవైపు చర్చలు కొనసాగుతున్న సమయంలోనే రాజీనామా చేయడం ద్వారా ‘స్వచ్ఛందంగా బాధ్యత తీసుకున్నారు’ అన్న విషయం తెరపైకి తెచ్చారు.

రాజీనామా వెనుక..
ఇది కేవలంమంత్రి మార్పు మాత్రమే కాదు. నీట్‌ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో లీకేజీలపై బాధ్యత ఎవరిపై ఉంటుందనే ప్రశ్నను మళ్లీ లేవనెత్తింది. సీజేపీ ఆందోళనలు విద్యార్థుల సమస్యలను జాతీయ చర్చగా మార్చాయి. ప్రభుత్వం ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించినా, మంత్రి పదవి అంశంపైనే చివరి నిర్ణయం ఆలస్యంగా వచ్చింది.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రక్షాళన మొదలు పెట్టిన మోదీ మంత్రి రాజీనామాకు మాత్రం సుముఖంగా లేరు. కానీ పరిస్థితుల ఒత్తిడి మంత్రి రాజీనామాకు దారితీసింది. ఇప్పుడు కొత్త మంత్రి ఎవరు వస్తారు, విద్యా వ్యవస్థలో ఏ మార్పులు వస్తాయి అనేది ఆసక్తికరం. అయితే ఈ సంఘటన విద్యార్థుల ఒత్తిడి రాజకీయ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో మరోసారి నిరూపించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper